RK Roja: రోజా.. చెవిలో పువ్వులు.. మేడం రీ ఎంట్రీ స్టైలే వేరు!

మాజీ మంత్రి ఆర్.కె. రోజా గత కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లోనూ ఆమె పాత్ర తక్కువగానే కనిపించింది. ఆమెను వైసీపీ పక్కన పెట్టిందా? లేక రోజా స్వయంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకుందా? అనే అనుమానాలు గత కొన్ని నెలలుగా అభిమానుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.

అయితే, జూన్ 4న జగన్ పిలుపు మేరకు జరిగిన “వెన్నుపోటు దినం” కార్యక్రమంలో రోజా తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో రోజా చురుగ్గా పాల్గొన్నారు. “సూపర్ సిక్స్ లేదు, హామీలు లేవు, మేనిఫెస్టో మూలకీ!” అనే ప్లకార్డుతో, చెవిలో పువ్వు పెట్టుకుని తనదైన స్టైల్‌లో మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆమెతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసనలో పాల్గొన్నారు.

ఈ చిన్న రీ ఎంట్రీ పెద్ద చర్చకు దారి తీసింది. ఇటీవల పార్టీ మీటింగ్స్, మీడియా ప్రకటనల్లో ఎక్కడా కనిపించని రోజా.. ఇప్పుడు అనూహ్యంగా బయటకు రావడం వెనుక రాజకీయ సంకేతాలున్నాయా? తన ప్రత్యర్థులకు కౌంటర్‌గా ఈ స్టెప్ తీసుకున్నారా? అన్నది పార్టీలోని వర్గీయుల మధ్య చర్చనీయాంశంగా మారింది.

ఒకప్పుడు ఫైర్‌బ్రాండ్ మహిళా నాయకురాలిగా వెలుగొందిన రోజా, పార్టీపై వత్తిడి పెరగడంతో మళ్లీ తన రాజకీయ చైతన్యాన్ని చాటాలనుకుంటున్నారా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. త్వరలో రోజా మరింత యాక్టివ్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ అభిమానులు.

Leave a Reply