మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి రాజకీయ వేడి పెంచారు. మదనపల్లె, మండపేట, పెనుకొండ సహా పలువురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ఆయన, టీడీపీ మహానాడు పై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ, “టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ” అంటూ సెటైర్లు వేశారు.
“సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం,” అని వ్యాఖ్యానించిన జగన్, చంద్రబాబు పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. “చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు,” అని తీవ్ర ఆరోపణలు చేశారు.
పేర్లు రాసిపెట్టుకోండి.. రిటర్న్ గిఫ్ట్లు ఇద్దాం
ఈ సారి 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది. కార్యకర్తలకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నాం. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీతో సహా రిటర్న్… pic.twitter.com/8bVyXlGwOi
— Telugu Feed (@Telugufeedsite) May 28, 2025
“రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఉంటుంది” అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చిన జగన్, “ఎవరు చేసినా అన్యాయం మర్చిపోవద్దు, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం,” అంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. “ఈసారి 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుంది. అభివృద్ధి, సంక్షేమంతో పాటు కార్యకర్తల హక్కుల కోసం కూడా పోరాటం చేస్తాం,” అని స్పష్టం చేశారు.
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్, “ఫోజులు పెట్టడం కాదు, ప్రజలకి మేలు చేయడం నిజమైన నాయకత్వ లక్షణం” అని విమర్శించారు. “కరోనా సమయంలో కూడా మేము బాధ్యత వహించాం. ఇప్పుడేమైనా ఎదుర్కొనే సత్తా మా దగ్గర ఉంది,” అని స్పష్టం చేశారు.