దేశవ్యాప్తంగా రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలోని దాదాపు 1,500 మంది వితంతు మహిళలకు కానుకగా చీరలు పంపించారు.
సాధారణంగా రాఖీ రోజున సోదరీమణులు సోదరుల చేతికి రాఖీ కట్టి రక్షణ కోరుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ పండుగను ప్రత్యేకంగా మార్చారు. రక్షణ లేకుండా ఒంటరిగా ఉన్నారనే భావన తొలగించడానికి, వారికి కూడా ఒక సోదరుడు ఉన్నాడని ధైర్యం ఇవ్వడానికి ఈ చీరలను పంపించారు. “ఇది కేవలం కానుక కాదు, ప్రేమ, గౌరవం, ఆత్మీయతతో నిండి ఉంది” అని ఆయన తెలిపారు.
A Heartwarming Gesture like never before❤️
On #RakshaBandhan, to celebrate the auspicious occasion, Powerstar & DyCM @PawanKalyan specially gifted sarees to 1,500 widowed women. His selfless actions reflect a rare kind of leadership driven by empathy, service, and genuine care👏… pic.twitter.com/ESR9eoGoXT
— Jaiky Yadav (@JaikyYadav16) August 9, 2025
జనసేన పార్టీ కార్యకర్తలు స్వయంగా ప్రతి ఇంటికీ వెళ్లి చీరలను అందజేశారు. ఈ గిఫ్ట్ అందుకున్న మహిళలు మొదట ఆశ్చర్యపోయినా, తర్వాత వారి కళ్లలో ఆనంద బాష్పాలు కనిపించాయి. “మీకు నేను సోదరుడిని, ఎల్లప్పుడూ అండగా ఉంటాను” అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు వారికి ఎంతో బలాన్ని ఇచ్చాయి.
ఈ కార్యక్రమాన్ని కేవలం కానుకల పంపిణీగా కాకుండా, మహిళల మనసుల్లో ధైర్యం, నమ్మకం నింపే ప్రయత్నంగా నిర్వహించారు. ప్రతి ఇంటిలోకి వెళ్లినప్పుడు, “ఇది పవన్ అన్నయ్య నుండి రాఖీ శుభాకాంక్ష” అని చెబుతూ చీరను అందించారు. బహుమతులు ఇచ్చి వెళ్లిపోకుండా, మహిళలతో ఆప్యాయంగా మాట్లాడి, వారి సమస్యలను విని, భుజంపై చేయి వేసి ప్రేమను పంచుకున్నారు.