కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సందడిగా ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఏఐ టెక్నాలజీతో రూపొందించిన దివంగత ఎన్టీఆర్ ప్రసంగం వీడియో.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 102వ జయంతిని పురస్కరించుకుని, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఇదే సందర్భంగా మహానాడు వేదికపై ఎన్టీఆర్ ఏఐ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.
ఏఐ సహాయంతో ఎన్టీఆర్ ప్రసంగం.
ఏఐ వీడియో సాయంతో సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగాన్ని మహానాడులో ప్రదర్శించిన #TDP నాయకులు.
ఆ ప్రసంగంలో @ncbn, @naralokesh లను ప్రశంసలతో ముంచెత్తారు.#KadapaMahanadu pic.twitter.com/UHzI7H5vdG
— greatandhra (@greatandhranews) May 28, 2025
ఈ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, లోకేష్ల సేవలను ప్రశంసించారు. ‘‘సికింద్రాబాద్కు ట్యాంక్ బండ్తో సాంస్కృతిక వారధి కడితే, సైబరాబాద్ను సాంకేతిక ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దింది చంద్రబాబే. లక్షల జీతాలు కలగా కనిపించిన రోజుల్లో, ఆ కలను సాకారం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే’’ అని తెలిపారు.
‘‘డ్వాక్రా సంఘాల ద్వారా ఆడపడుచులకు ఆర్థిక స్వావలంబన కలిగిన తీరును చూసి నాకెంతో గర్వంగా ఉంది. పోలవరం వంటి ప్రాజెక్టులు తెలుగువారి కలలను నెరవేర్చే దిశగా ప్రయాణిస్తున్నాయి. ఆనాడు కిలో రూ.2 బియ్యం పథకాన్ని ఎందుకు ప్రారంభించామో.. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది’’ అంటూ స్పష్టంగా వెల్లడించారు.
ఈ వీడియోలో ఎన్టీఆర్ భావోద్వేగంగా మాట్లాడిన తీరు ప్రేక్షకుల్లో గూస్బంప్స్ కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఏఐ స్పీచ్ నెట్టింట వైరల్గా మారింది.