Nithyananda: నిత్యానంద స్వామి కన్నుమూత?.. హిందూ ధర్మం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారా?

వివాదాస్పద స్వామిగా ప్రసిద్ధి చెందిన నిత్యానంద స్వామి పై ఇటీవల వస్తున్న వార్తలు షాక్‌కు గురి చేస్తున్నాయి. కొన్ని మీడియా వర్గాలు ఆయన మరణంపై కథనాలు ప్రచారం చేస్తుండగా, ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ఈ వార్తలను సమర్థిస్తూ, నిత్యానంద తన ప్రాణాలను హిందూ ధర్మం రక్షణ కోసం త్యాగం చేశాడని ప్రకటించారు. ఈ వార్తతో పోలీసులు విచారణ ప్రారంభించారు, అయితే అధికారికంగా ఈ విషయంపై పూర్తి క్లారిటీ రాలేదు.

నిత్యానంద స్వామి తన ధర్మపరమైన, వ్యక్తిగత జీవితంలో వివాదాలతో పరిచయమయ్యారు. ఆయనపై అత్యాచారం, అపహరణ వంటి అనేక కేసులు నమోదయ్యాయి. 2019లో, అకస్మాత్తుగా భారతదేశం నుండి మాయమైన ఆయన, తర్వాత స్వతంత్ర దేశంగా తన స్వంత ద్వీప ‘కైలాస’ను స్థాపించి, దానిని ఐక్యరాజ్య సమితికి స్వతంత్ర దేశంగా గుర్తింపునిచ్చేందుకు అభ్యర్థన పంపినట్లు ప్రకటించారు.

ఇక 2022లో, నిత్యానంద స్వామి చనిపోయాడని వస్తున్న వార్తలకు సంబంధించి ఆయన స్వయంగా స్పందించారు. ఆయన తన ‘సమాధి’లో ఉండి, ప్రస్తుతం ‘సుప్తావస్థ’లో ఉన్నానని ప్రకటించారు. చివరిగా మహాశివరాత్రి సందర్భంగా ఆయన యూట్యూబ్ ఛానల్‌లో కనిపించారు. ఇప్పుడు, నిత్యానంద స్వామి డయాలసిస్ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు, రెండు రోజుల క్రితం ఆయన మరణించారని తాజా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ తన వీడియోలో, నిత్యానంద స్వామి హిందూ ధర్మాన్ని కాపాడటానికి తన ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు.

నిత్యానంద తన కెరీర్‌లో ఎన్నో వివాదాలతో వార్తల్లో నిలిచాడు. ఆయనపై సెక్స్ స్కాండల్ కేసులు ఉన్నాయి, ఆ కారణంగా ఆయన దేశం విడిచి పారిపోయాడు. రంజితతో తన సంబంధాలు కూడా తీవ్రమైన వివాదాలకు దారి తీసాయి. నిత్యానంద స్వామి 2002లో ‘నిత్యానంద’ పేరుతో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. 2003లో బెంగుళూరులోని బిడాడిలో ధ్యానపీఠం అనే ఆశ్రమాన్ని స్థాపించి, పర్యాటకులనూ, అనుచరులనూ ఆకర్షించారు.

Leave a Reply