కడప మహానాడులో మంత్రి నారా లోకేష్ శక్తివంతమైన ప్రసంగం ఇచ్చారు. రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేశారు. “టీడీపీని మాయం చేస్తామన్నారు, కానీ చివరకు వాళ్లే అడ్రస్ లేకుండా పోయారు” అంటూ తన వైఖరిని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు పనిచేయాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు.
లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వం స్థిరంగా ఉంటేనే పరిశ్రమలు పెట్టుబడులు పెడతాయని వివరించారు. కార్యకర్తల కోసం ఎప్పుడూ తమ ఇంటి తలుపులు ఓపెన్గానే ఉంటాయని హామీ ఇచ్చారు. “ప్రజల కోసమే చంద్రబాబు గారి జీవితం అంకితమైంది. రాయలసీమ గడ్డ టీడీపీ అడ్డా” అని నినాదాలు చేశారు.
సంక్షేమం, అభివృద్ధికి బ్రాండ్ సిబిఎన్. మన అందరి ధైర్యం సిబిఎన్. #MahanaduRoars#Mahanadu2025#TeluguDesamParty#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh pic.twitter.com/ElfNtutLLb
— Telugu Desam Party (@JaiTDP) May 29, 2025
“మాస్ మహానాడు జాతర అదిరింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోంది. 2024 ఎన్నికల ఫలితాలు అల్ టైమ్ రికార్డ్. టీడీపీని మాయం చేస్తామన్నారు కానీ అడ్రస్ లేకుండా పోయారు. సీబీఎన్ అంటే అభివృద్ధి, సీబీఎన్ అంటే మన ధైర్యం. రాయలసీమ డిక్లరేషన్కి కట్టుబడి ఉన్నాం. సీనియర్లను, జూనియర్లను సమానంగా చూస్తా. పని చేసే వారిని ప్రోత్సహిస్తా. అహంకారం పక్కన పెట్టి ప్రజలతో కలిసిపోవాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్ష తత్వంతో పని చేయాలి” అన్నారు లోకేష్.
టీడీపీ జెండా పీకేస్తామన్న వాళ్లు పార్టీ కార్యాలయం లేకుండా పోయారు. టీడీపీ అడ్రస్ గల్లంతు చేస్తామన్నవారు ప్రజాతీర్పులో గల్లంతయ్యారు. దశాబ్దాలుగా టీడీపీ జెండా రెపరెపలాడుతూనే ఉంది.#MahanaduRoars#Mahanadu2025#TeluguDesamParty#ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/16i3uobaXL
— Telugu Desam Party (@JaiTDP) May 29, 2025
అలాగే, “రెడ్ బుక్ అంటే అందరూ ఏడుస్తున్నారు. ఒకరికి గుండెపోటు, మరొకరు బాత్రూమ్లో పడిపోవడం.. మీకు అందరికీ తెలుసు ఎవరి పరిస్థితి ఏంటో. మహానాడులో తెచ్చిన ఆరు శాసనాలే మన శ్వాస” అంటూ సెటైర్లు వేశారు.
వైసీపీపై విమర్శలు చేస్తూ “టీడీపీ జెండా పీకేస్తామన్నారు. ఇప్పుడు వాళ్లే అడ్రస్ లేకుండా పోయారు. మద్యం స్కామ్తో ప్రజా ధనాన్ని దోచుకున్నారు. జే బ్రాండ్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. రాష్ట్రానికి మేలు కోసం కూటమి పార్టీలన్నీ ఒకటిగా పనిచేశాయి. 94 శాతం స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం. కడపలో పసుపు జెండా రెపరెపలాడుతోంది. కార్యకర్తే మా అధినేత. ఆర్థిక ఇబ్బందుల మధ్యనైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తాం. అభివృద్ధి వికేంద్రీకరణే మన అజెండా. సీబీఎన్ అంటే సంక్షేమం, చంద్రబాబు అంటే ట్రెండ్ సెట్టర్. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ గారు అన్ని విధాలా సహకరిస్తున్నారు” అని మంత్రి నారా లోకేశ్ స్పష్టంగా తెలిపారు.