Medaram Jatara – 2026: మేడారం గిరిజన జాతర.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర (Medaram Tribal Fair 2026) వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు ఘనంగా జరగనుంది. జాతరను సువ్యవస్థితంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వుల ప్రకారం, రూ.150 కోట్లు ఈ మహా జాతర కోసం మంజూరు చేశారు. ఈ నిధులను మేడారం మహా జాతర ఏర్పాట్లతో పాటు శాశ్వత నిర్మాణాల, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తారు.

ఈ నిధులతో మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే మహా జాతరకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరలో లక్షలాది భక్తులు దేశం నలుమూలల నుండి తరలివస్తారు. ఈసారి గతం కంటే మరింత వైభవంగా జాతర నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

పూజారులు అధికారికంగా జాతర తేదీలను ప్రకటించారు:

జనవరి 28 – సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరు

జనవరి 29 – సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరిక

జనవరి 30 – భక్తులు మొక్కులు చెల్లించడానికి వేలాదిగా తరలివస్తారు

జనవరి 31 – అమ్మవార్ల వనప్రవేశం

జనవరి 30న సమ్మక్క, సారలమ్మ వనదేవతలతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజుల వనప్రవేశం సందర్భంగా దేశం నలుమూలల నుండి లక్షలాది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించటం జరుగుతుంది.

Leave a Reply