తెలుగుదేశం పార్టీ కడప జిల్లా చెర్లోపల్లిలో ఘనంగా నిర్వహిస్తున్న మహానాడు సభల్లో రాజకీయ రగడలతో పాటు రుచి విందుకూ ప్రత్యేక ఆకర్షణగా మారింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలకు మూడు రోజుల పాటు వెజ్, నాన్వెజ్ వంటకాలతో విస్తృత భోజన విందును సిద్ధం చేశారు.
వంటకాల వెనుక శ్రమ:
మహానాడు క్యాటరింగ్ను విజయవాడకు చెందిన అంబికాస్ క్యాటరింగ్ సంస్థ చూసుకుంటోంది. 2014 నుండి మహానాడు భోజన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ సంస్థ ప్రతినిధి శివాజీ ప్రకారం, ఈసారి మూడు రోజుల పాటు రోజూ 50 వేల మందికీ, చివరి రోజు లక్షమందికీ విందు భోజనాలు సిద్ధం చేస్తున్నారు. వంటకు 1,700 మంది, వడ్డించేందుకు 800 మందిని నియమించారు. మొత్తం 10 లక్షల వాటర్ బాటిల్స్ను స్టాక్ చేశారు.
ప్రముఖులు పర్యవేక్షణలో:
బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో భోజన కమిటీని ఏర్పాటుచేశారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవితతో పాటు ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, చింతమనేని ప్రభాకర్ తదితరులు భోజన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రత్యేకంగా మామిడికాయలు తెప్పించి ఆవకాయ కూడా మెనూలో చేర్చారు.
రేపటి నుండి మూడు రోజులపాటు కడప జిల్లా సి కె దిన్నె మండలం పబ్బాపురంలో జరగనున్న పసుపు పండుగ మహానాడు ఏర్పాట్లను @ChintamaneniTDP గారు ఇతర నేతలతో కలిసి పరిశీలించడం జరిగింది.
★మూడు రోజుల పాటు పండుగలా నిర్వహించే మహానాడుకు సర్వం సిద్ధం
★మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు… pic.twitter.com/A0y26oMMz3
— Devineni Uma (@DevineniUma) May 26, 2025
మహానాడు ప్రత్యేక మెనూ:
మొదటి రోజు: తాపేశ్వరం కాజా, గోంగూర చికెన్, వెజిటబుల్ బిర్యానీ
రెండో రోజు: అల్లూరయ్య మైసూర్ పాక్, దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ
మూడో రోజు: బగారా రైస్, చికెన్ కర్రీ
స్వీట్స్ & స్నాక్స్: డ్రైఫ్రూట్ హల్వా, చక్కెర పొంగలి, టూటీఫ్రూటీ కేసరి, కార్న్ సమోసా, మిర్చి బజ్జి, పకోడీ, బిస్కెట్లు
ఉదయం టిఫిన్ మెనూ:
పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్, టిఫిన్ స్వీట్స్తో కాఫీ, టీ
మధ్యాహ్న భోజన మెనూ:
నాన్వెజ్: గోంగూర చికెన్, ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ, దోసకాయ మటన్, ఎగ్ రోస్ట్
వెజ్: గోంగూర పూల్ మఖానా, టమాటా పప్పు, బెండకాయ బూందీ, ములక్కాయ టమాటా గ్రేవీ
అన్నం-పచ్చడులు: తెల్లన్నం, ప్లెయిన్ బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, రోటి పచ్చడి, పెరుగు
రాత్రి భోజన మెనూ:
వంకాయ బఠాణీ కూర, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు, రోటి పచ్చడి, తెల్లన్నం, పెరుగు
ఫసిలిటీలు:
మహానాడు ప్రాంగణంలో అన్ని వైపులా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం 450 ఎకరాలు కేటాయించగా, బహిరంగ సభ కోసం దాదాపు 5 లక్షలమంది హాజరుకావచ్చునని అంచనా. అన్ని వంటకాలతోపాటు తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.