Maganti Gopinath: మాగంటి ఆసుపత్రిలో చేరటం వెనుక అసలు కారణం ఇదేనా?

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మికంగా ఆసుపత్రిలో చేరడంపై రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఆయన ఆరోగ్య సమస్యలకు అసలు కారణం ఏమిటన్నదానిపై ఇప్పుడు చర్చ ఊపందుకుంది. మాగంటి కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నేతల అభిప్రాయం ప్రకారం.. ఆయన అత్యంత సమీప అనుచరుడు సర్దార్ ఆత్మహత్య చేసుకోవటమే మాగంటి మానసిక స్థితిని తీవ్రంగా దెబ్బతీసిందని చెబుతున్నారు.

ఒక వారం క్రితం బోరబండలో చోటుచేసుకున్న సంఘటనలో బీఆర్ఎస్ మైనార్టీ నేత సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫసియుద్దీన్‌ అనే కార్పొరేటర్ వేధింపులే కారణమని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా, చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సర్దార్‌ మాగంటి అత్యంత సన్నిహితుడు కావడంతో, ఆయన మృతితో గోపీనాథ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారని తెలుస్తోంది. రోజులు గడుస్తున్నా మాగంటి ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నారు. కుటుంబసభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం, ఆయన గత కొన్నిరోజులుగా భోజనం లేకుండా, నిద్ర లేకుండా సర్దార్‌ విషాదాన్ని తలుచుకుంటూ గడిపారని తెలుస్తోంది.

బీఆర్ఎస్ నేతల అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత ఫసియుద్దీన్‌ ఉద్దేశపూర్వకంగా సర్దార్‌ను టార్గెట్ చేశాడని, అదే మాగంటిని మానసికంగా దెబ్బతీసే దిశగా జారిపోయిందని అంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఇప్పటికీ సరైన స్పందన ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు మాగంటి పలు సార్లు ఫోన్ చేసి సమస్యను వివరించినప్పటికీ, న్యాయం జరగలేదని వాపోతున్నారు. ఈ వ్యవహారాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీరియస్‌గా తీసుకుంటామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? సర్దార్‌ ఆత్మహత్య కేసులో నిజం ఏమిటి? ఈ వ్యవహారం ఎటు దారి తీయబోతుందో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

శ్రీ విశ్వశాంతి మహా శక్తిగా దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్ గణేశుడు.. ఎత్తు ఎంతంటే?
ఆపరేషన్ సిందూర్ పేరు వింటే పాక్ కు అదే గుర్తొస్తుంది.. ప్రధాని మోదీ

Leave a Reply