తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘‘ఎంత పాపం చేశావ్ రేవంత్.. నిన్నటివరకు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డల మధ్య గొడవలు పెట్టావు. ఇప్పుడు మహాలక్ష్మి పేరిట అక్కచెల్లెళ్లను జుట్లు పట్టుకుని కొట్టుకునేలా చేస్తున్నావు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉందా?’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఇక మహిళల కోసం ప్రకటించిన మహాలక్ష్మి పథకం రూ.2500 నకదు ప్రోత్సాహాన్ని ఇప్పటికీ అందించకపోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన ప్రభుత్వం.. కనీసం హామీ ఇచ్చిన రూ.2500ను అందించలేకపోతున్నదని మండిపడ్డారు.
ఎంత పాపం చేశావ్ రేవంత్..
నిన్నటిదాకా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డల మధ్య కొట్లాట పెట్టావు..
ఇప్పుడు.. మహాలక్ష్మి పేరిట మభ్యపెట్టి అక్కచెల్లెళ్ళు జుట్లు పట్టుకుని కొట్టుకునేలా చేస్తావా ??
ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటాదా??
కోటిమందిని కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు కనీసం గ్యారెంటీ… pic.twitter.com/q3OqnKWUX6
— KTR (@KTRBRS) August 7, 2025
‘‘నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో మహాలక్ష్మి పథకం కోసం మొదలైన ఘర్షణలు రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెకు పాకే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త..!’’ అని కేటీఆర్ హెచ్చరించారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ హాట్ టాపిక్గా మారింది.
