బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. లీగల్ నోటీసులకు భయపడాల్సిన అవసరం లేదని, నిజం సింహం లాంటిది, తనను తానే రక్షించుకుంటుందని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా నేరస్తులు ప్రయత్నించినా తప్పించుకోలేరని, నిజం ఎప్పుడూ గెలుస్తుందని పేర్కొన్నారు.
Game On. No question of fearing legal notices.
Truth is a lion; set it free and it will defend itself.
Criminals who ruined lives through phone tapping will be exposed.Satyameva Jayate!!
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 12, 2025
ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన బండి సంజయ్, మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు.
కేసులో స్పందించిన కేటీఆర్, బండి సంజయ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని, ప్రజాప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని నోటీసులలో పేర్కొన్నారు. ఈ నోటీసులో బండి సంజయ్ చేసిన నిరాధార ఆరోపణల వల్ల తన పరువుకు నష్టం కలిగిందని తెలిపారు.
బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీస్!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు లీగల్ నోటీసులు పంపారు.
ఫోన్ ట్యాపింగ్లో తన ప్రమేయం ఉందని ఆధారాలు లేకుండా బండి సంజయ్ ఆరోపించారని కేటీఆర్ మండిపడ్డారు.… pic.twitter.com/o6fVR5eHX6
— The Bharat (@TheBharat_News) August 12, 2025
కేటీఆర్ తరపు న్యాయవాదులు హెచ్చరించారు, నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లోగా బండి సంజయ్ స్పందించకపోతే, సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.