బాలీవుడ్ స్టార్ జంట సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ దంపతులకు శుభవార్త. కియారా తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంటకు ఇది మొదటి సంతానం కావడం విశేషం.
ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ శుభవార్తతో రెండు కుటుంబాల్లోనూ, అభిమానుల్లోనూ ఆనందం వెల్లివిరుస్తోంది. సిద్ధార్థ్ – కియారా జంట కూడా ఈవిషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.
Kiara Advani and Sidharth Malhotra welcome a baby girl
Kiara Advani and Sidharth Malhotra welcomed their first child today. The couple was blessed with a baby girl. pic.twitter.com/0GfEIgcMJc
— Nandini Chaar (@ndccomputers) July 15, 2025
గత ఫిబ్రవరి 28న వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా తల్లిదండ్రులం కాబోతున్నామనే విషయాన్ని పంచుకున్నారు.
కియారాను డెలివరీ కోసం ముంబై గిర్గావ్లోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె పాపకు జన్మనిచ్చింది. ఈ శుభవార్త తెలిసిన వెంటనే సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
View this post on Instagram
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో సిద్ధార్థ్ – కియారా వివాహం జరిగింది.