Telangana High Court: కేసీఆర్, హరీష్‌రావుకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR), మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao)లకు తెలంగాణ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అంతేకాక, పూర్తిస్థాయి కౌంటర్‌ను దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం తరఫున కోర్టుకు సమాధానమిస్తూ, ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తరువాతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కేసీఆర్, హరీష్‌రావు ఇద్దరూ ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీలో చర్చ జరిగాకే చర్యలు ఉంటాయని ప్రభుత్వం వాదించింది.

ఇదిలా ఉండగా, ప్రభుత్వంపై కూడా హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. ముందుగా మీడియా సమావేశం నిర్వహించి, ఆపై 60 పేజీల రిపోర్ట్ విడుదల చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. అన్ని పబ్లిక్ డొమైన్‌ నుండి ఆ రిపోర్ట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది.

అలాగే, కమిషన్ 8B, 8C నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్లపై ఆరోపణలు చేయడాన్ని హైకోర్టు చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. దీనిపై మూడు వారాల్లో స్పష్టమైన వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఈ పరిణామాలతో కాళేశ్వరం నివేదిక రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply