బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కు సూటిగా హెచ్చరించారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపరాదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రతి వార్డుకు వందల సంఖ్యలో నామినేషన్లు వేయిస్తామని ఆమె సవాల్ విసిరారు.
త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కవిత ఈ బీసీ రిజర్వేషన్ అంశాన్ని ప్రాధాన్యంగా లేవనెత్తారు. “బీసీలకు సముచిత హక్కులు కల్పించకపోతే ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటాం” అంటూ ఆమె స్పష్టం చేశారు.
ఇక జూలై 16,17,18 తేదీల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రైల్వే రోకోలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర బీసీ బిల్లుకు మద్దతుగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. “రైల్వే వ్యవస్థను స్తంభింపజేస్తాం” అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
గ్రామపంచాయతీలోని ఒక్కో వార్డుకు 100 నామినేషన్లు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటాం
ప్రతీ వార్డులో 100 నామినేషన్లు వేసేలా చేస్తాం
– కవిత#Telangana #Hyderabad #BRS #KTR #BJP #RevanthReddy #KTR pic.twitter.com/QWy7C1rhfy
— Telugu Galaxy (@Telugu_Galaxy) June 18, 2025
బనక చర్ల ప్రాజెక్ట్ విషయంలో ఢిల్లీలో ఉద్యమాలు చేయాలని సూచించిన కవిత, కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సెటైర్లు వేశారు. “పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ఒరిగేదేమీ లేదు,” అంటూ విమర్శించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై “గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేశారు” అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
కేటీఆర్పై ఏసీబీ విచారణ టైమ్ పాస్ మాత్రమే అని అభిప్రాయపడిన కవిత, బీఆర్ఎస్కు అనుబంధంగా తెలంగాణ జాగృతి పని చేస్తుందన్నారు.