జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంట్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్లో కేసు నమోదైంది.
#YCPinsultsWomen
మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం@ysjagan గారు! మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో అవమానించవచ్చా? అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట! ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే… pic.twitter.com/d4Pvmqy2AE— Lokesh Nara (@naralokesh) June 7, 2025
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంట్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్లో కేసు నమోదైంది. ఓ ఛానల్లో అమరావతి రైతుల ధర్నాపై ఆయన డిబెట్ నిర్వహించారు. ఈ సందర్భంలో డిబెట్లో పాల్గొన్న మరో జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజు నోరు జారారు.
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్
అమరావతి మహిళలను కించపరిచిన కేసులో అరెస్ట్ చేసిన ఏపీ తుళ్లూరు పోలీసులు
హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్న పోలీసులు https://t.co/FOeERtfWAB pic.twitter.com/bsr5WFCWde
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2025
రాజధాని ప్రాంతంలో వేశ్యలు ఉన్నారని కృష్ణంరాజు అన్నారు. ఆ సమయంలో ఆయన మాటల్ని డిబెట్ నిర్వహిస్తున్న శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో అమరావతి ప్రాంతంలోని మహిళా నాయకులు వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో ఏపీ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో వారిద్దరిపై ఫిర్యాదు ఇచ్చారు. హైదరాబాద్ నుంచి కొమ్మినేని శ్రీనివాస్ రావును విజయవాడ తరలిస్తున్నారు.