ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ జాను లిరి తన రెండో వివాహంపై స్పష్టత ఇచ్చింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ, “అవును.. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాను” అని అధికారికంగా ప్రకటించింది. తన కాబోయే భర్త ఫోక్ సింగర్ దిలీప్ దేవ్గన్తో కలిసి దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఈ విషయం వెల్లడించింది.
జాను స్పందిస్తూ.. “ట్రోల్స్ను పట్టించుకోను. నాకు నా కొడుకు సంతోషమే ముఖ్యమని చెప్పింది. పెళ్లి తర్వాత కూడా నా కొడుకుతో సంతోషంగా జీవిస్తాను. నన్ను ప్రేమిస్తున్నవారు ఆశీర్వదించండి” అంటూ అభ్యర్థించింది. ఆమె మాటల్లో ధైర్యం, స్పష్టత కనిపించింది. ఇదే ఫోటోను దిలీప్ దేవ్గన్ కూడా తన అకౌంట్లో షేర్ చేస్తూ, “జాను నా జీవిత భాగస్వామి కాబోతుంది. మేము ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాం” అని ప్రకటించాడు.
జాను ఇప్పటికే ఒకరిని ప్రేమ వివాహం చేసుకుంది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుంది. ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఆమెపై వచ్చిన ట్రోల్స్కి ఇది బదులుగా చెప్పినట్లయింది.
జాను సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. “ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2”లో విజేతగా నిలిచిన తర్వాత ఆమె ఫేమ్ రెట్టింపైంది. ఇదే సమయంలో వచ్చిన ట్రోలింగ్లు ఆమెను కొంతకాలం వేధించినా, ఇప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని అనిపిస్తోంది.