పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో జరిగిన పర్యటన సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగమ్మ జాతరలో ప్రదర్శించిన “నరుకుతాం” అనే డైలాగ్ ఉన్న ఫ్లెక్సీపై స్పందించిన ఆయన, అది టీడీపీ కార్యకర్తే పెట్టాడంటే మంచిదే అని వ్యాఖ్యానించారు.
జగన్ మాట్లాడుతూ, పర్యటన విజయవంతంగా ముగిసిన తర్వాత దానిలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయడం సరికాదని విమర్శించారు. “ఒక నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే కేసు పెడతారా?” అంటూ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు.
అలాగే, ఫ్లెక్సీలపై కూడా స్పందించిన జగన్, పుష్ప సినిమా డైలాగ్ ఆధారంగా ఫ్లకార్డులు పట్టుకున్నారని కేసులు పెట్టడం ఏమిటి? ఇది ప్రజాస్వామ్యమా?” అని అసహనం వ్యక్తం చేశారు.
రప్పా రప్పా అంటూ తేదేపా కార్యకర్తే టీడీపీ వారిని నరుకుతానంటున్నాడంటే చంద్రబాబు పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు 🤣😂🔥 pic.twitter.com/tqY8Pr5WDl
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) June 19, 2025
ఈ సమయంలో పక్కనే ఉన్న నాయకుడు, ఫ్లెక్సీ పట్టుకున్న వ్యక్తి గతంలో టీడీపీలో యాక్టివ్గా ఉన్నాడని చెప్పగా, జగన్ స్పందిస్తూ “అయితే మరీ బావుందే. టీడీపీ కార్యకర్తే చంద్రబాబు పాలనపై నరుకుతాం అంటుంటే.. ఆ కోపం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తి వైసీపీలో చేరి తమ వైపు నిలవడం గర్వకారణం” అని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, “టీడీపీ శ్రేణుల్లో కూడా నిరాశ, కోపం ఉండటం సహజం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని ఈ ప్రభుత్వం తీరుపై వారు నిరసన వ్యక్తం చేయడంలో ఆశ్చర్యం లేదు” అని జగన్ పేర్కొన్నారు.