హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ధరలు మే 17 నుంచి పెరుగనున్నాయి. ఎల్ అండ్ టి మెట్రో రైల్ లిమిటెడ్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, కనిష్ఠ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.12కి, గరిష్ట ధరను రూ.60 నుంచి రూ.75కి పెంచారు. ఈ నిర్ణయం రోజూ మెట్రోపై ఆధారపడే ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం చూపనుంది.
ప్రయాణికులకు ఈ పెంపు శరీరంపై భారం వేసేలా ఉండనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నగర ట్రాఫిక్ వలన మెట్రోపై ఆధారపడే వారు ఇప్పుడు పెరిగిన ఛార్జీలతో విసుగు చెందే ప్రమాదం ఉంది.
Hyderabad Metro new rates
Revised ticket charges…
🟥NEW SENSE pic.twitter.com/UIXZQK3bgj
— NEW SENSE (@Shyamsundarak6) May 15, 2025
పెరిగిన ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి:
1-2 స్టాప్లకు: రూ.12
2-4 స్టాప్లకు: రూ.18
4-6 స్టాప్లకు: రూ.30
6-9 స్టాప్లకు: రూ.40
9-12 స్టాప్లకు: రూ.50
12-15 స్టాప్లకు: రూ.55
15-18 స్టాప్లకు: రూ.60
18-21 స్టాప్లకు: రూ.66
21-24 స్టాప్లకు: రూ.70
24 కి మించి: రూ.75
ఈ పెంపు నేపథ్యంలో సంస్థ మాట్లాడుతూ:
“మా ప్రయాణికుల మద్దతుకు కృతజ్ఞతలు. మెట్రో సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ఈ టికెట్ ధరల సవరణ అవసరమైంది. మీ సహకారం కోరుతున్నాం” అని ప్రకటించింది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్, ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రోకి అనుబంధంగా పనిచేస్తోంది. ఈ మెట్రో ప్రాజెక్టును డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (DBFOT) మోడల్పై నిర్మించి నిర్వహిస్తోంది. ప్రాజెక్ట్ ఒప్పందాన్ని 2010 సెప్టెంబర్ 4న అప్పటి ప్రభుత్వం చేయడం జరిగింది.