గద్వాల్ తేజేశ్వర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు తరహాలోనే, తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లాలో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య చర్చనీయాంశమైంది. పెళ్లి అయిన నెల రోజుల్లోనే భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమలరావుతో కలిసి భర్తను హత్య చేయించినట్లు విచారణలో వెల్లడైంది.

పోలీసులు కేసు నమోదు చేసి, ఐశ్వర్యతో పాటు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పోలీసుల ప్రకారం, భర్త తేజేశ్వర్‌ను ఎలాగైనా తొలగించాలని ఐశ్వర్య పక్కా ప్రణాళిక వేసిందని తెలుస్తోంది. ప్రియుడితో కలిసి జీవించాలనే మోజుతో ఆమె ఈ ఘోర నిర్ణయం తీసుకుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యకోసం రూ.75,000 సుపారీ ఇచ్చినట్లు సమాచారం.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బ్యాంకు మేనేజర్ తిరుమలరావు ఉన్నారు. ఆయనతోపాటు సుపారీ బ్రోకర్, కారు డ్రైవర్, ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, ఇంకా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది.

పోలీసుల దృష్టిలో ఇది ప్లాన్ చేసిన కుట్రగా పరిగణించబడుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Leave a Reply