ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ – 2025 ఫైనల్ లిస్ట్ విడుదలైంది. స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ కోనా శశిధర్ సోమవారం ఉదయం దీన్ని ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో లిస్ట్ను చూడవచ్చు.
https://apdsc.apcfss.in/SelectionList
ఈ సందర్భంగా కోనా శశిధర్ మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా డీఎస్సీ ఫైనల్ లిస్ట్ విడుదల చేశామని తెలిపారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని, ఈ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్కు ధన్యవాదాలు తెలిపారు.
ఎంపికైన అభ్యర్థుల వివరాలు
మెగా డీఎస్సీకి మొత్తం 3.36 లక్షల మంది అభ్యర్థుల నుంచి 5.07 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీరిలో 15,941 మందికి ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి. మిగిలిన పోస్టులకు సరైన అర్హత కలిగిన వారు దొరకలేదని అధికారులు తెలిపారు.
గణనీయమైన విషయమేమిటంటే, ఫైనల్ లిస్ట్లో ఎంపికైన వారిలో 49% మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన వారందరికీ విద్యాశాఖలోకి స్వాగతం పలికారు.
నియామక పత్రాలు ఎప్పుడు?
ఈనెల 19న అమరావతిలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. తరువాత కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగులు నిర్ణయించబడతాయి.
హారిజంటల్ రిజర్వేషన్లు ఈసారి కొత్తగా అమలులోకి వచ్చాయి. సందేహాల నివృత్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు.
ప్రక్రియ పూర్తయిన విధానం
జూన్ 6 నుంచి జూలై 2 వరకు రెండు విడతలుగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు.
జూలై 5న ప్రాథమిక కీ, ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదలైంది.
అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ను ఏడు విడతలుగా పూర్తిచేశారు.
తాజాగా ఫైనల్ లిస్ట్ ప్రకటించబడింది.
#MegaDSCinAndhraPradesh
🎉 A Promise Fulfilled📜 Mega DSC was the very first file signed by Hon’ble CM Sri @ncbn Garu upon assuming office at the Secretariat, Amaravati.
👏 In less than 150 days, the School Education Department, #AndhraPradesh has successfully concluded Mega…
— Lokesh Nara (@naralokesh) September 15, 2025
నారా లోకేశ్ స్పందన
ఎంపికైన అభ్యర్థులను మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా అభినందించారు. apdsc.apcfss.in వెబ్సైట్లో ఎంపికల జాబితా అందుబాటులో ఉంది. ఈసారి అర్హత సాధించలేకపోయిన వారు నిరుత్సాహ పడొద్దు. హామీ ఇచ్చినట్లుగానే ప్రతీ ఏడాది డీఎస్సీ నిర్వహిస్తాం” అని హామీ ఇచ్చారు.
అలాగే, సీఎం చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం చేసిన దస్త్రం మెగా డీఎస్సీ అని గుర్తుచేశారు. కేవలం 150 రోజుల్లో ఈ భారీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. “ఈ మైలురాయి ఏపీ విద్యా వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తుంది” అని లోకేశ్ పేర్కొన్నారు.