మెగా బ్రదర్స్ తల్లి అంజనా దేవి ఆరోగ్యంపై వచ్చిన ఊహాగానాలకు మెగా బ్రదర్ నాగబాబు ముగింపు పలికారు. “అమ్మ ఆరోగ్యం పూర్తిగా బాగుంది. తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు” అంటూ స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారని వార్తలు వైరల్ కావడంతో మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో నాగబాబు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. “అమ్మ ఆరోగ్యంగా ఉంది. దయచేసి నిర్ధారణ లేని వార్తలు రాయొద్దు” అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో అనేక పుకార్లకు చెక్ పడింది. మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది.
There is some inaccurate information being circulated,but she is absolutely fine.— Naga Babu Konidela (@NagaBabuOffl) June 24, 2025
ఇదే విధంగా గతంలోనూ అంజనాదేవి అనారోగ్యం గురించి తప్పుడు ప్రచారం జరిగిన సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా స్పందించి ఆమె ఆరోగ్యంగా ఉన్నారని తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇలాంటి వదంతులు వైరల్ కావడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక, అంజనాదేవి ఆరోగ్యంపై వచ్చిన వార్తల నేపథ్యంలో కేబినెట్ మీటింగ్ నుంచి పవన్ కల్యాణ్, షూటింగ్ నుంచి చిరంజీవి హుటాహుటిన వెళ్లారని ప్రచారం జరిగినప్పటికీ.. నాగబాబు ఇచ్చిన క్లారిటీతో ఇవన్నీ రూమర్లేనని తేలిపోయింది.