Alekhya Chitti Pickles: పచ్చడి రేట్లు అడిగితే.. బూతులతో రెచ్చిపోయిన ‘అలేఖ్య చిట్టిపికిల్స్’.. కొత్త ఆడియోతో మళ్లీ వైరల్!

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘అలేఖ్య చిట్టిపికిల్స్’ వివాదానికి ఎండ్ ఎప్పుడో తెలియదు. మరో కొత్త ఆడియో వైరల్ కావడంతో ఈ వివాదం మళ్లీ ఊపందుకుంది.

అలేఖ్య చిట్టిపికిల్స్ అనే పచ్చడి బ్రాండ్‌కి ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బోలెడంత పాపులారిటీ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి ఈ బ్రాండ్‌ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ వైరల్ అయిన వీడియోలతో భారీగా ఫాలోయింగ్ సంపాదించారు. కానీ అదే సోషల్ మీడియా ఇప్పుడు వాళ్ల వ్యాపారానికి అడ్డంకిగా మారింది.

కొత్త ఆడియో: గట్టిగా అడిగితే బూతులే జవాబు
ఓ యువతి, “మీ పచ్చళ్లు చాలా ఖరీదుగా ఉన్నాయి కదా” అని ప్రశ్నించగా, వెంటనే ఆ బ్రాండ్‌కు చెందిన మహిళ తిట్ల వర్షం ప్రారంభించింది. “ఒసెయ్ పిచ్చి ముఖందానా… ఈ రేట్లను భరించలేనివి అంటే నీ దరిద్రం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. నా మాట విని నాలుగు ఇళ్లల్లో పాచిపనులు చేసుకుని బతుక్కో వెళ్లు!” అంటూ తీవ్రస్థాయిలో బూతులు వర్షం కురిపించింది.

“నీ లవర్ ఒక బిర్యానీ అడిగితే కూడా నువ్వు కొనివ్వలేవ్… ముష్టి పచ్చడే కొనలేని స్థితిలో ఉన్నావ్..ఇంక గోల్డ్ ఏం కొంటావ్.. ల** కొడకా!” అంటూ ఓ వ్యక్తిపై నీచంగా మాట్లాడిన ఆడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

పచ్చడి ధర ఎక్కువ అని అడిగిన కస్టమర్‌ను టార్గెట్ చేస్త.. “నీ బతుకే దరిద్రం… పెళ్లి చేసుకోవాలని అనుకునే హక్కు కూడా నీకు లేదు…” అంటూ దారుణంగా దూషించిందని ఆ కస్టమర్ చెబుతున్నాడు. అతను ఆ వాయిస్ మెసేజ్‌ను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే… ఆ వీడియో విపరీతంగా షేర్ అవుతూ వైరల్ అయింది.

“ఇంత ఖరీదైన పచ్చడి ఎందుకని అడిగితే ఇలా బూతులు తిట్టాలా?” “కస్టమర్‌ అంటే దేవుడంటారు… కానీ ఇక్కడ దెయ్యంలా తిడుతున్నారు” “బిజినెస్‌ అంటే బాధ్యతతో ఉంటేనే నిలబడుతుంది.. లేకపోతే ఇలా గల్లంతవుతారు” అని పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు.

ఈ కాంట్రవర్సీ వల్ల ‘అలేఖ్య చిట్టిపికిల్స్’కు బ్రాండ్ ఇమేజ్ తుడిచిపెట్టినంత పనైంది. కొత్త కస్టమర్లు దూరంగా ఉన్నారు. ఇప్పటికే వారు పెట్టిన ఆర్డర్లను కూడా క్యాన్సిల్ చేస్తూ కస్టమర్లు వెనక్కి తగ్గుతున్నారు. “వాళ్ల బూతుల పచ్చడికి నో చెప్పండి” అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వీడియోల ద్వారా బ్రాండ్ బిల్డింగ్‌ చేసుకున్న ఈ అక్కాచెల్లెళ్ల బృందం, ఇప్పుడు అదే సోషల్ మీడియా చేతిలో బలైపోతోంది. “పాములు పట్టేవాడు చివరికి పాముకాటుకే బలయ్యాడు” అన్నట్టు అయింది.

ఇలాంటి వ్యవహారాలు కేవలం ఒక బిజినెస్‌కు మాత్రమే కాదు, ఆ బ్రాండ్‌పై నమ్మకంతో ఉన్న కస్టమర్లను కూడా దూరం చేస్తాయి. మరి ఈ వివాదం ఎప్పుడు ఆగుతుంది? అలేఖ్యచిట్టిపికిల్స్ తమ వ్యవహారశైలిని మార్చుకుంటారా? లేక ఇంకా వైరల్ వీడియోలే కొనసాగుతాయా? అన్నదీ చూడాలి.

Leave a Reply