తానో లేడీ అఘోరీ అంటూ వీడియోలతో సంచలనం సృష్టించిన శ్రీనివాస్ చివరకు తన ప్రేమకథను వివాహంగా మార్చేశాడు. వర్షిణి అనే యువతిని ప్రేమించి, చివరికి ఆమె మెడలో తాళి కట్టేశాడు. వేద మంత్రాల నడుమ, సాధువుల సాక్షిగా జరిగిన ఈ వివాహం ఇప్పుడు వైరల్ కావడమే కాదు.. వివాదానికి కేంద్రంగా మారుతోంది.
వర్షిణీ పెళ్లి చేసుకున్న లేడీ అఘోరీ#ladyaghori #varshini #aghorivarshinimarriage #latestnews #virałpost #viralrell #andhraprabha #andhraprabhanews pic.twitter.com/fBrfXk8Xiu
— Andhra Prabha News (@andhraprabha_) April 15, 2025
సోమవారం నార్త్ ఇండియాలో ఓ పురాతన దేవాలయంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితులు, సాధువులు, భక్తుల మధ్య అఘోరీ వర్షిణికి తాళి కట్టాడు. తలంబ్రాలు, దండల మార్పిడి, హోమగుండం చుట్టూ ఏడు అడుగులు.. అన్నీ జాగ్రత్తగా జరిగాయి. పెళ్లి తర్వాత మాట్లాడుతూ, “ఇదొక దైవ సంబంధం.. మేమిద్దరం పార్వతీ పరమేశ్వరుల లాగా తిరిగి పుట్టాం,” అంటూ చేసిన కామెంట్లు జనాల్లో కలకలం రేపుతున్నాయి.
ముచ్చటగా మూడోసారి
పెళ్లి చేసుకున్న అఘోరి, శ్రీవర్షిణి…#aghori #aghorinagasadhu #SriVarshini #LadyAghoriMarriage #LatestNews #BIGTVcinema pic.twitter.com/tYA7VhbXDE— BIG TV Cinema (@BigtvCinema) April 15, 2025
కానీ అదే సమయంలో.. ఈ అఘోరి పెళ్లి వెనుక పెద్ద మోసాల వ్యవహారం బయటపడుతోంది. యోని పూజ పేరుతో ఓ మహిళా నిర్మాతను మోసం చేసిన కేసులో ఈ ‘లేడీ అఘోరీ’పై కేసు నమోదు కావడం సంచలనం. ఫిబ్రవరి 25న సైబరాబాద్ మొకిలా పోలీస్ స్టేషన్లో 308(5), 318(1), 351(4), 352 BNS సెక్షన్ల కింద FIR నమోదైంది. ఉజ్జయినిలోని ఫాం హౌస్కు పిలిపించి, పూజ చేస్తానంటూ రూ. 10 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ పెళ్లి వేదికపై ఓ వైపు వేద మంత్రాలు.. మరోవైపు పోలీసు సెక్షన్ల కేసు.. ఇదంతా చూడగా నిజమేనా అనే డౌట్ వస్తోంది. రెండు విడతలుగా తాళికట్టినట్టు అఘోరి చెబుతుండగా, రెండే విడతల్లో డబ్బులు దోచుకుందని బాధితురాలు చెబుతోంది.
సాధువుల నడుమ పెళ్లి చేసుకునే ఈ జంట.. సైబర్ చీటింగ్ కేసులో ఎలా బయటపడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం వీరి పెళ్లి వీడియోలతో అట్టుడుకుతుండగా.. కొన్ని వాయిస్ క్లిప్స్, చాట్స్ కూడా లీకవుతున్నాయని సమాచారం.