అఘోరీ, వర్షిణి సంచలన వ్యాఖ్యలు.. మమ్మల్ని టచ్ చేస్తే ప్రాణాలు వదులుతాం..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ మరియు వర్షిణి వ్యవహారంపై తాజాగా ఇద్దరూ స్పందించారు. అరెస్ట్ వార్తల నేపథ్యంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వీరు.. “మమ్మల్ని ఎవరు టచ్ చేయొద్దు, ఆ ప్రయత్నం చేస్తే ప్రాణాలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

తాము ఉత్తరాఖండ్‌లోని కేదారనాధ్‌కు వెళ్లిపోతున్నామని, ఇక తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టబోమని అఘోరీ, వర్షిణి వెల్లడించారు. “దేశంలో ఇంకో సమస్య లేనట్లుగా అందరూ మమ్మల్ని గాలిస్తున్నారు. మీడియా తప్పుగా ప్రచారం చేస్తోంది. మమ్మల్ని టార్గెట్ చేయడం ఆపండి, లేదంటే కారుతో పాటు మేమూ చనిపోతాం” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“మా గురించి మీడియా ట్రోలింగ్ చేస్తోంది. మేము ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు. మా జీవితం మేము బతుకుకుంటున్నాం. వదిలేయండి. ఆసత్య ప్రచారం ఆపండి. లేకపోతే అంతం చేసుకుంటాం” అంటూ స్పష్టం చేశారు.

తనకు ముందే అఘోరికి భార్య ఉందని వస్తున్న ప్రచారాన్ని వర్షిణి ఖండించారు. “అదంతా ఫేక్. నేనే అతని మొదటి భార్య. ఎవరైనా ఆధారాలుంటే చూపండి. మమ్మల్ని వదిలేయండి. బలిదానం చేస్తారన్న ప్రచారం పూర్తిగా అబద్ధం” అని తెలిపారు.

ఇక అఘోరి వ్యాపారులను మోసం చేశాడని, యోని పూజల పేరిట డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టగానే అరెస్ట్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఆశ్రమం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశాడన్న ఆరోపణలు కూడా ఊపందుకుంటున్నాయి.

Leave a Reply