అఘోరీ, శ్రీ వర్షిణి వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవలే ఈ జంట పెళ్లి చేసుకుని సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. వర్షిణీ మెడలో మూడోసారి తాళి కట్టిన వీడియోలు నెట్టింట్లో విపరీతంగా పాపులర్ అయ్యాయి. అయితే పెళ్లి అనంతరం వారిద్దరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో పరిస్థితి మలుపు తిరిగింది.
ప్రస్తుతం అఘోరీ, వర్షిణి ఇద్దరూ పరారీలో ఉన్నారు. నిన్నటి (బుధవారం) నుంచి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండటంతో వారు మాయమయ్యారనే చర్చ జోరందుకుంది. పోలీసుల అరెస్టు భయంతోనే తప్పించుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.
శ్రీ వర్షిణిని పెళ్లి చేసుకున్న అఘోరి #Aghori #SriVarshini #AghoriMarriage pic.twitter.com/QMuPDdfmw9
— C L N Raju (@clnraju) April 15, 2025
అఘోరీపై మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. తాజాగా షామీర్పేట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు నమోదైంది. ట్రాన్స్జెండర్ల సంఘాల నాయకురాలు జోగిని సంధ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అఘోరీ నిజంగా అఘోరీ కాదు.. ట్రాన్స్జెండర్. ఇలాంటి వాడు మా కమ్యూనిటీ పరువు తీసేశాడు. వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి. సనాతన ధర్మం అనే పేరు మీద మోసం చేస్తున్న వాడిని బయట ఉంచకూడదు’’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇక ఇదంతా పక్కన పెడితే, అఘోరీపై మరో మహిళ అయిన రాధ కూడా అతను తన మొదటి భర్త అంటూ మీడియా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారం ఒక్కసారిగా ఊహించని ఎత్తుకు చేరింది. సోషల్ మీడియాలో ప్రజలు కూడా దీనిపై హాట్గా చర్చించుకుంటున్నారు.
అఘోరీ-శ్రీ వర్షిణిల వ్యవహారం ఎటుగా తిరుగుతుంది? పోలీసుల అరెస్టు నుంచి ఎంతకాలం తప్పించుకుంటారు? అనే ప్రశ్నలతో ఇప్పుడు ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది.