టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోమవారం టెస్ట్ క్రికెట్కు అధికారికంగా వీడ్కోలు ప్రకటించిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ అనంతరం ఆయన తొలిసారి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బృందావన్ ధామ్ను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ఆయన నుండి ఆధ్యాత్మిక బోధనలను కూడా వినిపించుకున్నారు. బృందావన్ ధామ్కు కోహ్లీ మళ్లీ వచ్చిన సంగతి ఆయన అభిమానులను ఎంతో ఆకర్షిస్తోంది. గతంలో కూడా ఆయన అనేకసార్లు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించారు.
ఈ సందర్శనలోని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కోహ్లీకి కొత్త జీవన అధ్యాయానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్రికెట్లో అద్భుతమైన కెరీర్ తర్వాత కోహ్లీ ఇక ప్రశాంత జీవితం వైపు అడుగులు వేస్తున్నట్టుగా ఈ సందర్శనను వారు భావిస్తున్నారు.
Virat Kohli & Anushka Sharma से पूज्य Premanand महाराज जी के साथ एकांतिक वार्तालाप की…
नामजप करिए कल्याण हो जाएगा..#ViratKohli𓃵#ViratKohliretirement#viratkholipic.twitter.com/2YX3o0t2eq
— Gaurav Pandey (@gaurav5pandey) May 13, 2025
గమనించదగిన విషయం ఏమిటంటే, 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లీ, మొత్తం 113 టెస్టుల్లో 9,230 పరుగులు చేసి 30 సెంచరీలు, 31 అర్ధశతకాలు చేశాడు. ఇప్పుడు టెస్టులకు గుడ్బై చెప్పిన తర్వాత, అతని జీవితంలో ఆధ్యాత్మికత కొత్త పాత్ర పోషించబోతుందా? అన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.