ఐపీఎల్ 2025 సీజన్లో సెన్సేషన్గా మారిన రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి బీహార్ ప్రభుత్వం భారీ బహుమతిని ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్పై కేవలం 35 బంతుల్లో శతకం సాధించి రెండవ వేగవంతమైన సెంచరీ కొట్టినందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆయనకు రూ.10 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.
బీహార్కు చెందిన 14 ఏళ్ల వైభవ్ 2025 ఐపీఎల్ సీజన్లో ఆడిన అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. ఈ ఘనత సాధించిన వెంటనే సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్కు స్వయంగా ఫోన్ చేసి సీఎం నితీశ్ అభినందనలు తెలిపారు. “వైభవ్ దేశం తరపున ఆడి, మరిన్ని రికార్డులు తిరగరాయాలని ఆకాంక్షిస్తున్నాం,” అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కూడా వైభవ్ను అభినందించారు. ఆటగాళ్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం తమ ప్రభుత్వ ధ్యేయమని సామ్రాట్ పేర్కొన్నారు. తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, “వైభవ్ లాంటి యువకుడిని చూసి బీహార్ మొత్తం గర్విస్తోంది,” అని వ్యాఖ్యానించారు.
Bihar Chief Minister Nitish Kumar spoke on the phone to Vaibhav Suryavanshi, who scored a century in just 35 balls in IPL at the age of 14.
Bihar government will give a reward of Rs 10 lakh to Vaibhav Suryavanshi#Bihar #NitishKumar #VaibhavSuryavanshi #ipl2025 #ipl pic.twitter.com/TWtEHpk0nI
— The National Bulletin (@TheNationalBul1) April 29, 2025
వైభవ్ 2011 మార్చి 27న బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో జన్మించాడు. ఈ ఏడాది ప్రారంభంలో కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయసులో బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు ఐపీఎల్లో ఆడిన ప్రతీ షాట్తో భారత క్రికెట్లో తన స్థానాన్ని దృఢం చేసుకుంటున్నాడు.