UPI: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు కేంద్రం భారీ షాక్..!

డిజిటల్ పేమెంట్స్‌కు అలవాటు పడిన యూజర్లకు త్వరలోనే ఓ షాకింగ్ న్యూస్ రానుందని సమాచారం. రోజూ మనం ఉపయోగించే ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ (UPI) అప్లికేషన్‌ల ద్వారా రూ.2,000కి పైగా చేసే లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేయాలని యోచిస్తోంది. ఒకవేళ ఇది అధికారికంగా అమలులోకి వస్తే, సామాన్య ప్రజలతో పాటు చిన్నా పెద్ద వ్యాపారులు అందరూ ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితమవుతారు.

డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా పెరిగాయి. కిరాణా షాపు నుంచి కూరగాయల విక్రేత వరకు ప్రతి ఒక్కరూ యూపీఐ క్యూఆర్ కోడ్‌తోనే పేమెంట్స్ తీసుకుంటున్నారు. నగదు లేకుండానే రోజువారీ జీవితాన్ని స్మార్ట్‌ఫోన్‌ ఆధారంగా సాగించగలిగే స్థాయికి ప్రజలు అలవాటు పడ్డారు.

అయితే తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం రూ.2వేలు దాటి చేసే యూపీఐ పేమెంట్స్‌పై 18 శాతం జీఎస్టీ వసూలు చేయాలని యోచిస్తోంది. ఈ విధంగా పన్ను ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే ఈ నిర్ణయం అమలులోకి వస్తే, పెద్ద మొత్తంలో యూపీఐ పేమెంట్స్ చేసే వినియోగదారులపై భారం పడనుంది. ఇక చిరు వ్యాపారులు, డెలివరీ బాయ్స్, ఫ్రీలాన్సర్లు వంటి వారు కూడా డిజిటల్ లావాదేవీలను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో దేశంలో డిజిటల్ ఇండియా లక్ష్యం కోణం తప్పే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం ఇది ఇంకా ప్రభుత్వ స్థాయిలో చర్చలో ఉన్న సూచన మాత్రమే అయినా, ఒకవేళ ఇది అధికారికంగా అమలులోకి వస్తే, ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్‌లపై వినియోగదారుల భారం మరింతగా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

Leave a Reply