Teachers Day 2025 : టీచర్స్ డే స్పెషల్: డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి తెలియని అద్భుత విషయాలు!

భారతదేశ గొప్ప ఉపాధ్యాయుడు, రెండవ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఆయన గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం.

ఉపాధ్యాయ దినోత్సవం ఆరంభం

1962లో రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, విద్యార్థులు ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని అనుకున్నారు. కానీ ఆయన ఇలా స్పందించారు: “నా పుట్టినరోజు కాదు, ఉపాధ్యాయులందరినీ గౌరవించే రోజు జరుపుకుందాం.” అప్పటి నుంచి సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

జీవితం & విద్య

జననం: 1888 సెప్టెంబర్ 5, తమిళనాడులోని తిరుత్తణి గ్రామం

చిన్నతనం నుంచే చదువుపట్ల ఆసక్తి, తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్‌లో తత్వశాస్త్రం చదివారు

1907లో తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తిచేశారు

ఉపాధ్యాయునిగా ప్రస్థానం

1910లో ఉపాధ్యాయునిగా కెరీర్ ప్రారంభించి, అద్భుతంగా పాఠాలు బోధించారు.

1929లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్‌గా ఆహ్వానించబడ్డారు

బెనారస్ హిందూ యూనివర్సిటీలో 9 ఏళ్లపాటు వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు

రాష్ట్రపతిగా & రాజకీయ జీవితం

1947లో UNESCOలో భారత్ ప్రతినిధిగా సేవలందించారు

1952లో ఉపరాష్ట్రపతిగా, 1962–67 మధ్య రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు

ఆయన పాలనలో న్యాయం, నీతి, విద్యకు ప్రాధాన్యత లభించింది

రచనలు & సాహిత్యం

డా. రాధాకృష్ణన్ అనేక పుస్తకాలు రాశారు:

రబీంద్రనాథ్ ఠాగూర్ తత్వం – ఠాగూర్ ఆధ్యాత్మికత విశ్లేషణ

Living with a Purpose – స్వాతంత్ర్య సమరయోధుల జీవితం

Faith Renewed – స్వీయ అవగాహనపై విలువైన ఆలోచనలు

గౌరవాలు

1954లో భారతరత్న పురస్కారం

27 సార్లు నోబెల్ బహుమతి నామినేషన్

వ్యక్తిగత జీవితం

1903లో శివకాము గారిని వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు (చరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్) ఉన్నారు.

సాధారణ వ్యక్తిగా మొదలై భారతరత్నగా నిలిచిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ప్రతి ఒక్కరికి ప్రేరణ. ఆయన వల్లే గురువులను గౌరవించే ఈ ప్రత్యేక దినోత్సవం మన దేశంలో కొనసాగుతోంది.

Leave a Reply