యాక్సియం-4 మిషన్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం విజయవంతంగా భూమిపైకి చేరుకుంది. శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో దిగారు.
18 రోజుల అంతరిక్ష యాత్ర
జూన్ 25న అమెరికాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్లో అంతరిక్షంలోకి బయల్దేరిన ఈ బృందం 28 గంటల ప్రయాణం తర్వాత ISSలోకి చేరుకుంది. మొత్తం 18 రోజులు అక్కడ గడిపిన వీరు, 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. వీటిలో శుభాంశు స్వయంగా 7 ముఖ్యమైన ప్రయోగాలు చేశారు.
वेलकम बैक शुभांशु…
हर भारतीय के लिए गर्व का समय, धरती पर वापसी के बाद शुभांशु शुक्ला की पहली तस्वीर.#ShubhanshuShukla pic.twitter.com/7njo51snjU
— NDTV India (@ndtvindia) July 15, 2025
ప్రత్యేక పరిశోధనలు
జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే ప్రభావాన్ని శుభాంశు అధ్యయనం చేశారు. అంతరిక్షంలో మానవ జీర్ణవ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేశారు. దీనిపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేక వీడియో రూపొందించారు. అంతేకాదు వ్యోమగాముల మానసిక స్థితిగతులపై కూడా విశ్లేషణ చేశారు.
Lucknow: Group Captain Shubhanshu Shukla's family rejoices as the Axiom-4 Dragon spacecraft safely returns to Earth.#ShubhanshuShukla | #AxiomMission4 | #Axiom pic.twitter.com/b1EgIIw3su
— All India Radio News (@airnewsalerts) July 15, 2025
స్పేస్లో అద్భుత అనుభవం
“కిటికీ పక్కన కూర్చుని భూమిని చూడటం నా జీవితంలో అద్భుతమైన అనుభూతి” అని శుభాంశు తెలిపారు. అంతరిక్షంలో వ్యవసాయం చేసే దిశగా కూడా పరీక్షలు చేశారు. ఫ్లోటింగ్ వాటర్ బబుల్ సృష్టించి అందులో గడిపిన అనుభవాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.
288 సార్లు భూప్రదక్షిణ
18 రోజుల ISS యాత్రలో శుభాంశు బృందం 76 లక్షల మైళ్లు ప్రయాణించి, మొత్తం 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది. అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు.
— SIGMA (@SIGMAXBOI) July 15, 2025
రాకేశ్ శర్మ జ్ఞాపకాలు
భూమిపైకి తిరిగి రాకముందు వీడ్కోలు ప్రసంగం చేస్తూ, 41 ఏళ్ల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ చెప్పిన మాటలను శుభాంశు గుర్తుచేసుకున్నారు.
“నేటి భారత్ సగర్వంగా ముందుకు సాగుతోంది.. ఈరోజు నా దేశం నిజంగా ‘సారే జహా సే అచ్ఛా’గా కనిపిస్తోంది” అంటూ రాకేశ్ శర్మ వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావించారు.