ముంబై వాంఖడే క్రికెట్ స్టేడియంలో ఓ స్టాండ్కు రోహిత్ శర్మ పేరు పెట్టిన వేళ, ఆ దృశ్యాలు అందరినీ కదిలించాయి. ఈ ఘనతను చూశాక రోహిత్ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన భార్య రితిక కూడా కంటతడి పెట్టి మామ వెనక్కి వెళ్లి దాక్కొనాలని ప్రయత్నించింది. ఈ మధురమైన సందర్భం నెటిజన్లను కూడా ప్రభావితం చేసింది. “ఇదే కదా పేరెంట్స్కి గర్వించే మునుపటి మూమెంట్” అంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ స్పందనలు వెల్లువెత్తాయి.
వాస్తవానికి, ముంబైలోని వాంఖడే స్టేడియంలో (Wankhede Stadium) ఓ స్టాండ్కు రోహిత్ శర్మ పేరు పెట్టడం, ఆయన కెరీర్లో ఒక అరుదైన గౌరవంగా నిలిచిపోతుంది. ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ప్రారంభించగా, రోహిత్ తల్లిదండ్రులు, భార్య రితిక కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టేజ్పై రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవడం, రితిక కళ్లలో కన్నీళ్లు రావటం ఎవరినైనా కదిలించకుండా ఉండలేదు.
The way Rohit’s parents and Ritika are Crying 😭🥺❤ pic.twitter.com/XOW4nZJvEu
— Shikha (@Shikha_003) May 16, 2025
ఈ సందర్భాన్ని రోహిత్ శర్మ కూడా ఎంతో భావోద్వేగంగా స్వీకరించారు. “ఇలా నా పేరుతో స్టాండ్ను పెట్టినందుకు ఊహించలేదు. ఇది ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అందించిన ఒక అరుదైన గౌరవం. నా జీవితంలోని మరపురాని రోజుల్లో ఇదొకటి” అని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ… “వాంఖడే స్టేడియంలో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. రెండువిధాల ఫార్మాట్ల నుంచి రిటైర్ అయినప్పటికీ, వన్డేల్లో మాత్రం ఇంకా ఆడుతున్నాను. మే 21న ఢిల్లీతో ఇక్కడే మ్యాచ్ ఉంది. మళ్లీ ఈ మైదానంలో ఆడాలనుంది” అంటూ తన క్రికెట్ ప్రయాణంపై ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
One of the heart touching moment from the event the way she stepped back to wipe her tears,let Rohit’s parents lead,and quietly held it all in.A woman who’s seen it all and stood by her man through every high and low with grace,strength, and love.
pic.twitter.com/LiZa5L8Nw6— diya (@sanchaita4577) May 16, 2025
ఈ సంఘటనతో రోహిత్ మాత్రమే కాదు, అతని కుటుంబం కూడా భారత క్రికెట్లో ఓ ప్రత్యేక గుర్తుగా నిలిచింది. ఇది కేవలం గౌరవం మాత్రమే కాదు – తరతరాల క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో చెరగని గుర్తుగా మిగిలిపోతుంది.