PM Modi: జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక ప్రకటన?

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన ప్రసంగం జరగనుండగా, ఇది ఆపరేషన్ సిందూర్ అనంతరం జరుగుతున్న తొలి ప్రసంగం కావడం విశేషంగా మారింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధాని ఏం ప్రకటించబోతున్నారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇదే సమయంలో భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంగా, రెండు దేశాల డైరెక్టర్లు (DGMOలు) సోమవారం సాయంత్రం కీలక చర్చలకు సిద్ధమయ్యారు. ఈ చర్చల్లో భారత్ మూడు ప్రధాన డిమాండ్లను ముందుపెట్టనుందని సమాచారం.

Leave a Reply