భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన ప్రసంగం జరగనుండగా, ఇది ఆపరేషన్ సిందూర్ అనంతరం జరుగుతున్న తొలి ప్రసంగం కావడం విశేషంగా మారింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధాని ఏం ప్రకటించబోతున్నారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇదే సమయంలో భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంగా, రెండు దేశాల డైరెక్టర్లు (DGMOలు) సోమవారం సాయంత్రం కీలక చర్చలకు సిద్ధమయ్యారు. ఈ చర్చల్లో భారత్ మూడు ప్రధాన డిమాండ్లను ముందుపెట్టనుందని సమాచారం.
అవేంటంటే:
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు అండ ఇవ్వడం పూర్తిగా ఆపాలి
మసూద్ అజార్, హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీంలను భారత్కు అప్పగించాలి
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను (POK) భారత్కు అప్పగించాలి
ఈ క్రమంలో ప్రధాని మోదీ ప్రసంగంలో ఏవైనా తేలికపాటి సంకేతాలు ఉంటాయా? లేక ఆపరేషన్ సిందూర్ కొనసాగింపుగా మరింత దూకుడైన నిర్ణయాలపై సంకేతాలిస్తారా? అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.