ఇండియా- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ డైరెక్టర్ ఉత్తమ్ మహేశ్వరి ‘ఆపరేషన్ సిందూర్’ అనే టైటిల్తో సినిమా పోస్టర్ విడుదల చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది.
ఈ టైటిల్తో సినిమా వచ్చే అవకాశం ఉందని అనౌన్స్ చేయడంతో పాటు, పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. అయితే, ఇదంతా దేశ భద్రత, సైనికుల త్యాగాల నేపథ్యంలో జరుగుతున్న తరుణంలో రావడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. స్క్రిప్ట్ లేకుండా, నటీనటుల వివరాలు ఇవ్వకుండా కేవలం టైటిల్ ద్వారా ప్రచారం పొందాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రచారం జరుగుతోందని చాలామంది విమర్శించారు.
Bollywood film #OperationSindoor sparked outrage after its poster dropped mid real-life military op no cast, no script, just a title grab.
Public backlash forced a takedown and apology. Over 30 production houses raced for similar titles. pic.twitter.com/FApimWfkDg
— Filmyscoops (@Filmyscoopss) May 10, 2025
ఈ విమర్శల నేపథ్యంలో డైరెక్టర్ ఉత్తమ్ స్పందించారు. “ఈ సినిమా ద్వారా డబ్బు లేదా పాపులారిటీ కోసం కాదు, దేశ సైనికుల ధైర్యం, త్యాగాన్ని సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో నేనే ఈ టైటిల్ ఎంచుకున్నాను. అయితే నేను పోస్ట్ చేసిన టైమింగ్ వల్ల ఎవరైనా బాధపడి ఉంటే… దానికి బాధితుడిని. ఎవరినీ గాయపరచాలన్న ఉద్దేశం లేదు” అంటూ ఓ క్షమాపణ లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అయితే ఇప్పటికీ నెటిజన్లలో ఈ టైటిల్ చుట్టూ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. సినిమా తీసే ఉద్దేశం నిజమేనా? లేక వైరల్ కోసం.. వ్యూస్ కోసం చేస్తున్న ప్రయత్నమా? అనే ప్రశ్నలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి.