Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లోగో డిజైన్ చేసిన వారు ఎవరంటే..?

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మే 7న భారత సైన్యం పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు జరిపింది. ఈ చర్యకు ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టడం తెలిసిందే. ఆపరేషన్ విజయాన్ని గుర్తు చేస్తూ, సైన్యం విడుదల చేసిన పోస్టర్‌లో కనిపించిన లోగో వెనుక కథ ఇప్పుడు వైరల్ అవుతోంది.

చాలామంది ఈ లోగోను ప్రభుత్వం తయారు చేసిందని భావించారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దీన్ని డిజైన్ చేసింది మామూలు డిజైనర్లు కాదు.. స్వయంగా భారత సైన్యంలో పని చేస్తున్న ఇద్దరు జవాన్లు! వాళ్లే లెఫ్టినెంట్ కర్నల్ హర్ష్ గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్.

భారత సైన్యం ఆర్థరాత్రి 1.51 గంటలకు ఆపరేషన్ సిందూర్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా, దాని వెనుక ఉన్న అసలు డిజైనర్లు ఎవరు అన్నది ఇప్పుడు అధికారికంగా స్పష్టమైంది. సైనికుల మేధస్సు, సృజనాత్మకతకు ప్రతిరూపంగా నిలిచిన ఈ లోగోను వీరే రూపొందించారని ఇండియన్ ఆర్మీ అధికార పత్రిక బాత్‌చిట్ తాజా సంచికలో వెల్లడించింది.

ఇందులో గవర్నమెంట్ లేదా ఇతర డిజైనర్లు దీన్ని రూపొందించారన్న ప్రచారాలకు పుల్‌స్టాప్ పడింది. సైన్యం అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. దేశం కోసం ప్రాణాలే కాకుండా ప్రతిభను కూడా అంకితం చేస్తున్న మన జవాన్లను అభినందించకుండా ఉండలేం!

Leave a Reply