సాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ‘ఆపరేషన్ సింధూర్’లో (Operation Sindoor) ధైర్యం చూపిన 16 మంది BSF జవాన్లకు శౌర్య పతకాలు లభించాయి. దేశ సరిహద్దులను రక్షించిన వారి అసాధారణ సాహసానికి గుర్తింపుగా ఈ అవార్డులు ప్రకటించబడ్డాయి.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, మే 7 నుండి 10 వరకు భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ను చేపట్టింది. ఈ ఆపరేషన్లో BSF దళాలు కీలక పాత్ర పోషించాయి.
పాక్ బలగాలు, ముఖ్యంగా జమ్మూలోని ఖార్ఖోలా సరిహద్దు పోస్టు వద్ద మోర్టార్ షెల్స్, మెషిన్ గన్లతో దాడి చేశాయి. BSF సిబ్బంది ధైర్యంగా ఎదుర్కొని, శత్రువుల డ్రోన్లను కూల్చి, వారి పోస్టులు, నిఘా పరికరాలను ధ్వంసం చేశారు. ఈ పోరాటంలో అసిస్టెంట్ కమాండెంట్ అభిషేక్ శ్రీవాస్తవ్, హెడ్ కానిస్టేబుల్ బ్రిజ్ మోహన్ సింగ్, కానిస్టేబుళ్లు భూపేంద్ర బాజ్పాయ్, రాజన్ కుమార్, బసవరాజా శివప్ప సుంకడ, దీపేశ్వర్ బర్మన్ వంటి సిబ్బంది అసాధారణ ధైర్యం కనబరచారు.
Gallantry Medals for Seema Praharis
This Independence Day, 16 Brave Seema Praharis are being awarded Gallantry Medals for their conspicuous bravery & unmatched valour, for being resolute & steadfast during the Ops Sindoor.
The medals are a testament to the Nation’s faith &… pic.twitter.com/wlENoJ3VF8
— BSF (@BSF_India) August 14, 2025
జబోవాల్ సరిహద్దు పోస్టు వద్ద అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఉదయ్ వీర్ సింగ్ శత్రువుల దాడిని సమర్థంగా ఎదుర్కొన్నారు. గాయపడినప్పటికీ వెనక్కి తగ్గకుండా పోరాడి, శత్రువుల నిఘా కెమెరాను ధ్వంసం చేసి HMG స్థావరాన్ని నిర్వీర్యం చేశారు.
కరోటానా ఖుర్ద్, కరోటానా ఫార్వర్డ్, సుచేతగఢ్ సరిహద్దు పోస్టుల వద్ద, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ రాజప్ప బీ.టీ. మరియు కానిస్టేబుల్ మనోహర్ క్సాల్క్సోలు ముందువరుసలోని సైనికులకు మందుగుండు సామగ్రిని అందించారు. ఈ ప్రయత్నంలో రాజప్ప ప్రాణాంతక గాయాలు పొందారు.
అసిస్టెంట్ కమాండెంట్ అలోక్ నేగి మఖ్యారిలో తన దళాన్ని సమర్థంగా నడిపించి, 48 గంటలకు పైగా శత్రువులపై ప్రహారం కొనసాగించారు.
ఈ శౌర్య పతకాలు BSFపై దేశం ఉంచిన విశ్వాసం, గౌరవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వీరుల వీరసాహసాలు దేశ రక్షణలో వారి నిస్వార్థ సేవకు స్ఫూర్తిదాయకం.