ఆపరేషన్ సిందూర్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్ చూడండి!

పహల్గాం ఉగ్రదాడికి బదులుగా భారత ప్రభుత్వం తీసుకున్న పటిష్ట చర్య ఆపరేషన్ సిందూర్. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, నెట్టింట యావత్ భారత ప్రజలు గర్వంతో స్పందిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఘటనపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.

ఉగ్రవాదులు దాడి సమయంలో ‘‘మీ మోదీకి చెప్పుకోండి’’ అని చెబుతూ బార్బరిక్‌గా ప్రవర్తించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా ‘‘చెప్పాం మోదీకి’’ అంటూ నెటిజన్లు ఇప్పుడు ఘాటుగా మీమ్స్ పంచుకుంటున్నారు. ఈ మీమ్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడి 28 మందిని ఘోరంగా హతమార్చారు. ఇందులో హిందువులనే లక్ష్యంగా ఎంచుకుని, ‘‘హిందువు కాదా?’’ అని అడిగి మరీ కొందరిని చంపిన దారుణ ఘటనలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, భారత ఆర్మీ తీసుకున్న కౌంటర్ ఆపరేషన్‌పై ప్రజలు గర్వపడుతున్నారు.

ఇదిలా ఉండగా, మరో మీమ్‌లో భారత మహిళ సింధూరాన్ని ఉగ్రవాదులు తుడిచివేశారని, ఇప్పుడు ఆ సింధూరాన్ని మళ్లీ భారత ఆర్మీ ఆమె నుదిటిపై పెట్టిందని తెలియజేస్తూ ఓ భావోద్వేగ చిత్రమూ వైరల్ అయింది. ఈ మీమ్ అనేక మందికి గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

సమాజంలో జాతీయ భావాన్ని ప్రోత్సహించే ఈ రకమైన మీమ్స్ యువతలో దేశభక్తిని మరింత బలపరిచేలా మారుతున్నాయి.

Leave a Reply