పహల్గాం ఉగ్రదాడికి బదులుగా భారత ప్రభుత్వం తీసుకున్న పటిష్ట చర్య ఆపరేషన్ సిందూర్. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, నెట్టింట యావత్ భారత ప్రజలు గర్వంతో స్పందిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఘటనపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
Tell Modi …. 🥲
I told modi 💥💥
This picture speaks a a lot 💥💥#OperationSindoor pic.twitter.com/ijNvru80Zt
— 𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 🛕🇮🇳 (@Shiva4TDP) May 7, 2025
ఉగ్రవాదులు దాడి సమయంలో ‘‘మీ మోదీకి చెప్పుకోండి’’ అని చెబుతూ బార్బరిక్గా ప్రవర్తించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా ‘‘చెప్పాం మోదీకి’’ అంటూ నెటిజన్లు ఇప్పుడు ఘాటుగా మీమ్స్ పంచుకుంటున్నారు. ఈ మీమ్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Jai Hind 🇮🇳 #OperationSindoor pic.twitter.com/rkf75QpdFS
— Kumar Shubham (@its_ShubhamK) May 7, 2025
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడి 28 మందిని ఘోరంగా హతమార్చారు. ఇందులో హిందువులనే లక్ష్యంగా ఎంచుకుని, ‘‘హిందువు కాదా?’’ అని అడిగి మరీ కొందరిని చంపిన దారుణ ఘటనలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, భారత ఆర్మీ తీసుకున్న కౌంటర్ ఆపరేషన్పై ప్రజలు గర్వపడుతున్నారు.
#OperationSindoor pic.twitter.com/YdVeZwjaLt
— Dr Gill (@ikpsgill1) May 7, 2025
ఇదిలా ఉండగా, మరో మీమ్లో భారత మహిళ సింధూరాన్ని ఉగ్రవాదులు తుడిచివేశారని, ఇప్పుడు ఆ సింధూరాన్ని మళ్లీ భారత ఆర్మీ ఆమె నుదిటిపై పెట్టిందని తెలియజేస్తూ ఓ భావోద్వేగ చిత్రమూ వైరల్ అయింది. ఈ మీమ్ అనేక మందికి గూస్బంప్స్ తెప్పిస్తోంది.
— Dr. Annie (@howwhowhen1) May 7, 2025
సమాజంలో జాతీయ భావాన్ని ప్రోత్సహించే ఈ రకమైన మీమ్స్ యువతలో దేశభక్తిని మరింత బలపరిచేలా మారుతున్నాయి.