భారత్ ఇప్పటికే ఆరు సార్లు ప్రపంచ సుందరి (Miss World) కిరీటాన్ని గెలుచుకుంది. మొదటిసారిగా 1966లో రీటా ఫారియా ఈ టైటిల్ను అందుకుంది. ఇప్పుడు, ఏడోసారి ఈ ఘనతను సాధిస్తే, భారత్ అంతర్జాతీయంగా ఒక కొత్త రికార్డును నెలకొల్పనుంది.
మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఇప్పటివరకు మూడు సార్లు ఆతిథ్యం ఇచ్చింది. 1996లో బెంగళూరులో 46వ ఎడిషన్, 2023లో ముంబయిలో 71వ ఎడిషన్, ఇప్పుడు 72వ ఎడిషన్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇప్పటి వరకు ఆరు సార్లు టైటిల్ గెలిచిన భారత్, ఈసారి గెలిస్తే ఏడు సార్లు విజేతగా నిలిచిన ప్రపంచంలో ఏకైక దేశంగా మారుతుంది.
టాప్ 5 మిస్ వరల్డ్ విజేత దేశాలు:
భారత్ – 6 సార్లు: 1966 (రీటా ఫారియా), 1994 (ఐశ్వర్యా రాయ్), 1997 (డయానా హెడెన్), 1999 (యుక్తా ముఖి), 2000 (ప్రియాంక చోప్రా), 2017 (మానుషి చిల్లార్)
వెనిజులా – 6 సార్లు: 1955, 1981, 1984, 1991, 1995, 2011
యునైటెడ్ కింగ్డమ్ (UK) – 5 సార్లు: 1961, 1964, 1965, 1974, 1983
సౌత్ ఆఫ్రికా – 3 సార్లు: 1958, 1974, 2014
అమెరికా (USA) – 3 సార్లు: 1973, 1990, 2010
ఇతర దేశాల్లో ఐర్లాండ్ (1985, 1988, 2005), జమైకా (1963, 1976, 1993), స్వీడన్ (1951, 1952, 1977) మూడుసార్లు ఈ టైటిల్ను గెలుచుకున్నాయి.
భారత్ తరఫున నందినీ గుప్తా – గెలిస్తే చరిత్రే!
2023 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నందినీ గుప్తా, ఇప్పుడు మిస్ వరల్డ్ 2025 పోటీల ఫైనల్కు ఎంపికయ్యారు. రాజస్థాన్లోని కోటాకు చెందిన ఆమె వయసు 21 సంవత్సరాలు. బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశారు. ఈసారి నందినీ విజేతగా నిలిస్తే, భారత్ మిస్ వరల్డ్ను ఏడు సార్లు గెలిచిన తొలి దేశంగా చరిత్ర సృష్టిస్తుంది.
ఈ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుండగా, నందినీ గెలుపు కోసం దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మన దేశానికి మరో గౌరవకరమైన ఘనత సాధించే అవకాశం దగ్గరలోనే ఉంది. నందినీ విజయం కోసం మనం అందరం ఆకాంక్షిద్దాం!