జమ్మూకశ్మీర్ (Jammu & Kashmir) లోని కిశ్త్వర్లో గురువారం క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) సంభవించింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరుకున్నట్టు సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అలాగే మరో 100 మంది గాయపడ్డారని వెల్లడించారు. గల్లంతైన వారి కోసం రెండో రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో పరిస్థితుల గురించి ఆరా తీశారని ఆయన వెల్లడించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. క్లౌడ్ బరస్ట్ జరిగిన ప్రాంతంలో సుమారు 1,200 మంది ఉన్నారని అంచనా.
On 13 Aug, a cloudburst at Lamayuru blocked NH-1, stranding 60 LMVs and 30 HMVs including tourists.
Project VIJAYAK @BROindia braved rain, landslides and darkness, restoring trafficability by 14 Aug 0100 hrs and ensuring safe evacuation, including two… pic.twitter.com/pXjR8zczKs
— 𝐁𝐨𝐫𝐝𝐞𝐫 𝐑𝐨𝐚𝐝𝐬 𝐎𝐫𝐠𝐚𝐧𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧 (@BROindia) August 14, 2025
కిశ్త్వర్లో ఇప్పటికే NDRF బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. అందువల్ల రోడ్డు మార్గం ద్వారా రక్షణ బృందాలను పంపుతున్నారు. NDRF, పోలీసులు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు, సైనిక బృందాలతో కలిపి మొత్తం 300 మంది రక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు లభించిన మృతదేహాల్లో 21 మందిని గుర్తించినట్టు అధికారులు తెలిపారు.
A massive cloudburst has struck the Chishoti area in Jammu & Kashmir’s Kishtwar, along the route to the Machail Mata Yatra.
As per initial reports heavy losses are feared.
Our thoughts and prayers are with the victims, their families, and all those affected by this calamity. pic.twitter.com/fFP4860Gty
— J&K Congress (@INCJammuKashmir) August 14, 2025
మరోవైపు, మచైల్ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు కూడా ఈ దుర్ఘటనకు బలయ్యారు. ఒక్కసారిగా వచ్చిన వరదలతో పలు భవనాలు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటన నేపథ్యంలో మచైల్ మాతా దేవి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
