కర్ణాటకలో ఓ మహిళ భద్రతపై నెట్టింట్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో ఒక యువతి ప్రయాణిస్తున్న సమయంలో, ఆమె నిద్రపోతుందనుకుని ఓ కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ ఘటనలో బాధిత యువతి పక్కనే నిలబడి, పదే పదే ఆమె ను టచ్ చేస్తూ లైంగికంగా వేధించాడు. ఈ దృశ్యాలను గమనించిన ఓ ప్రయాణికుడు తన మొబైల్లో వీడియోగా రికార్డ్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర విమర్శలకు గురవుతోంది.
కేఎస్ఆర్టీసీ బస్సులో నిద్రపోతున్న యువతిని లైంగికంగా వేధించిన కండక్టర్
కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో ఓ యువతి నిద్రపోతుండగా ఆమె పక్కనే వచ్చి నిలబడి ఆమెను పదేపదే టచ్ చేస్తూ లైంగికంగా వేధించిన కండక్టర్
ఇది గమనించిన తోటి… pic.twitter.com/NyYRyb3vwV
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2025
ఈ వీడియో ఆ రాష్ట్ర అధికారుల దృష్టికి వెళ్లిన వెంటనే, కేఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పందించి సంబంధిత కండక్టర్ను విధుల నుంచి తొలగించింది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి సామాజికంగా చర్చనీయాంశమైంది.
నిరుపయోగమైన పాడు ఆలోచనలు, కామవాంఛలతో ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ నెటిజన్ల నుంచి వెల్లువెత్తుతోంది. ప్రజా రవాణాలో కూడా మహిళలకు భద్రత కరువవుతోందన్న వాస్తవం మరింత తీవ్రంగా కనిపిస్తోంది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ప్రభుత్వ, రవాణా శాఖలు మరింత కట్టుదిట్టమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.