Jyoti Malhotra: హైదరాబాద్‌లో జ్యోతి మల్హోత్రా జాడలు.. వెలుగులోకి కీలక సమాచారం

పాక్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలపై అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. హైదరాబాద్‌లో కూడా సదరు కార్యకలాపాలకు సంబంధించి పలు ఆధారాలు వెలుగుచూస్తున్నాయి.

2023 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ హైదరాబాద్‌-బెంగళూరు వందే భారత రైలును ప్రారంభించిన సమయంలో.. జ్యోతి హైదరాబాద్‌లో కనిపించినట్లు సమాచారం. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అప్పటి గవర్నర్ తమిళసై పాల్గొన్నారు. అదే సమయంలో జ్యోతి యూట్యూబ్ వీడియోలు తీస్తూ అక్కడ హల్‌చల్ చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా ఆమెపై గూఢచర్యం ఆరోపణలు వెలుగులోకి రావడంతో.. ఆ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో ఎవ్వరినైనా కలిశారా? అక్కడ ఇంకా ఏవైనా వీడియోలు తీశారా? అనే కోణాల్లో నిఘా సంస్థలు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే బయటపడిన సమాచారం ప్రకారం.. జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్‌ఐ అధికారులతో సంబంధాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. అలీ అహ్వాన్ అనే వ్యక్తి ద్వారా ఆమె ఐఎస్‌ఐ అధికారులను కలిశారని, తర్వాత షకీర్, రాణా షాబాజ్ అనే వ్యక్తులతో కూడా సంప్రదింపులు జరిగినట్లు ఆధారాలు బయటపడుతున్నాయి.

Leave a Reply