Jyothi Malhotra: పుట్టిన ఏడాదికే వదిలేసిన తల్లి.. పాకిస్థాన్ స్పై జ్యోతి పూర్తి బ్యాక్ గ్రౌండ్..!

పాకిస్థాన్ స్పైగా పేరొందిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తాజాగా ఆమె తండ్రి హరీష్ మల్హోత్రా జ్యోతి చిన్నతనం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జ్యోతి పుట్టిన ఏడాదిన్నర వయసుకే ఆమె తల్లి అనాథాశ్రమంలో వదిలేసి వెళ్లిపోయిందని హరీష్ చెప్పారు.

ఇండియన్ యూట్యూబర్ జ్యోతి పైన పాకిస్థాన్ స్పైగా ఆరోపణలు వచ్చి అరెస్టయ్యాక ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా ఇటీవల నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, జ్యోతి చిన్నప్పుడు తల్లి లేకుండా తాను, తాతయ్య, మామలతో కలిసి ఆమెను పెంచుకున్నట్లు చెప్పారు. తల్లి లేనందున జ్యోతి పెంపకం సులభం కాదని ఆయన వాపోయారు.

హరీష్ చెప్పినట్టుగా, జ్యోతి యూట్యూబ్ వీడియోలను ఎప్పుడూ చూడలేదని, తన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కూడా పోలీసులు తీసుకుపోయారని, జ్యోతి బయటకు వెళ్లినప్పుడు ఎక్కడ వెళ్తుందో కుటుంబానికి తెలియజేయదని తెలిపారు. జ్యోతి తల్లిదండ్రులతో కలిసి ఉండడాన్ని ఇష్టపడకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

హరీష్ మల్హోత్రా ఫర్నిచర్ పెయింటర్‌గా పనిచేశాడు. ఆదాయం తక్కువగా ఉండగా, భార్య ఒత్తిడితో జవహర్ నగర్‌లో అద్దె ఇంటిని తీసుకుని జీవనం సాగించాడు. జ్యోతి పుట్టక ముందే భార్యతో వివాదాలు మొదలయ్యాయని, దీంతో జ్యోతి పుట్టిన ఏడాదిన్నరలోనే తల్లి ఆమెను అనాథాశ్రమంలో వదిలేసి వెళ్లిపోయిందని హరీష్ పేర్కొన్నారు.

తర్వాత జ్యోతి తండ్రి అనాథాశ్రమం నుంచి ఆమెను తీసుకొని పెంపకం కొనసాగించాడు. కొద్ది కాలంగా జ్యోతి తండ్రి పెయింటింగ్ పని మానేసి, కూతురు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఆయన తమ్ముడు విద్యుత్ సంస్థలో ఫోర్‌మాన్‌గా పని చేసి ఇటీవల రిటైర్ అయ్యాడు.

తండ్రి హరీష్ మాట్లాడుతూ.. జ్యోతి వయసు ప్రస్తుతం 34 సంవత్సరాలు అని, పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా నిరాకరించేదని, ఆమె ఎవరినైనా ఇష్టపడితే అతని గురించి నాకు చెప్పమని కోరానని అన్నారు. జ్యోతి ఎవరినీ ఇష్టపడలేదని తన తండ్రి స్పష్టం చేశారు.

Leave a Reply