Jyoti Malhotra: పాక్‌లో జ్యోతికి ఏకే-47 గన్‌మెన్ల భద్రత.. షాకింగ్ వీడియో వైరల్!

పాకిస్తాన్ గూఢచారి కేసులో అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మరోసారి వార్తల్లోకెక్కింది. ఆమె పాకిస్తాన్ టూర్‌లో తాలూకు ఓ సంచలన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జ్యోతికి ఏకే-47లతో కాపలాదారులుగా ఉన్న ఏడుగురు గన్‌మెన్లు కనిపించగా, ఆమెను వీఐపీలా రోడ్డుపై అంగరంగ వైభవంగా చుట్టుముట్టి రక్షణ కల్పించినట్లు స్పష్టమవుతోంది.

వీడియోలో ఆమెకు షాపులు, స్ట్రీట్లు గురించి అధికారులు వివరాలు చెబుతూ, జనాన్ని పక్కకు తప్పించమంటూ గన్‌మెన్లు మార్గం చూపుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోను ఓ విదేశీ యూట్యూబర్ చిత్రీకరించగా, ఆయన మాట్లాడుతూ – “ఒక యూట్యూబర్‌కు ఇంత భద్రతా చర్యలు? నేను ఇంతవరకు చూసింది లేదంటూ” ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉండగా, హరియాణా పోలీసులు తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో జ్యోతి చురుకుగా మాట్లాడిందని, స్పృహతోనే వారితో సంబంధాలు కొనసాగించిందని తెలిపారు. అయితే ఆమెకు ఉగ్రవాద ముఠాలు లేదా ఉగ్రవాదులతో సంబంధాలపై ఇప్పటివరకు ఎలాంటి నేరపూరిత ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు.

హిస్సార్ ఎస్పీ ప్రకారం, జ్యోతికి సాయుధ దళాల గుట్టులు తెలుసని చెప్పడానికి ఆధారాలేమీ లేవు. ఆమె పాక్ అధికారులతో పరిచయం ఉన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, మతం మార్చుకోవాలన్నా ఉద్దేశ్యం లేదని పోలీసుల విచారణలో తేలింది. దీనికి సంబంధించిన ఆధారాలు లేవని వారు పేర్కొన్నారు.

Leave a Reply