Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్‌లో ఉంటున్న 14 మంది ఉగ్రవాదుల లిస్టు విడుదల..!

జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కీలక చర్యలు చేపట్టాయి. రాష్ట్రంలో చురుకుగా పనిచేస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల వివరాలను గుర్తించి ప్రత్యేక జాబితా సిద్ధం చేశాయి. వీరంతా జమ్మూకాశ్మీర్‌లోనే మకాం వేసి ఉగ్రదాడులకు పాల్పడుతున్నట్టు సమాచారం.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టుల ఎదుగుదలని అరికట్టేందుకు ఇండియన్ ఆర్మీ పలు ప్రతిస్పందన చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 7 మంది ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేయడం, ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టడం వంటి అంశాలు చోటు చేసుకున్నాయి.

ఈ కొత్త జాబితాలో ఉండే ఉగ్రవాదుల వయస్సు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంది. వీరిలో చాలామంది హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ వంటి తీవ్రవాద గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు నిఘా సంస్థలు స్పష్టం చేశాయి.

ప్రత్యేక ప్రాంతాల వారీగా పరిశీలిస్తే, అవంతిపోరాలో జైష్ కు చెందిన ఓ కీలక ఉగ్రవాది, పుల్వామాలో లష్కరే, జైష్ గ్రూపులకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు, సోఫియాన్‌లో హిజ్బుల్‌కు చెందిన ఒకరు, అలాగే నలుగురు లష్కరే ఉగ్రవాదులు చురుకుగా ఉన్నట్లు తెలుస్తోంది. అనంత్‌నాగ్‌లో ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులు, కుల్గాం ప్రాంతంలో ఒక లష్కర్ ఉగ్రవాది యాక్టివ్‌గా ఉన్నారు.

ఉగ్రవాదుల పూర్తి జాబితా ఇలా ఉంది:

ఆదిల్ రెహమాన్ డెంటూ (21)

ఆసిఫ్ అహ్మద్ షేక్ (28)

అహ్సాన్ అహ్మద్ షేక్ (23)

హారిస్ నజీర్ (20)

ఆమిర్ నజీర్ (20)

యావర్ అహ్మద్ భట్

ఆసిఫ్ అహ్మద్ ఖండే (24)

నసీర్ అహ్మద్ వాని (21)

షాహిద్ అహ్మద్ కుటాయ్ (27)

ఆమిర్ అహ్మద్ దార్

అద్నాన్ సఫీ దార్

జుబైర్ అహ్మద్ వాని (39)

హరూన్ రషీద్ గనై (32)

జాకీర్ అహ్మద్ గనీ (29)

భద్రతా దళాలు ఇప్పటికే వీరిపై ప్రత్యేక నిఘా పెంచాయి. సమీప కాలంలోనే వీరిని అణచివేసేందుకు గట్టి చర్యలు తీసుకోనున్నారు.

Leave a Reply