ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలి ఐపీఎల్ 2025 మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు విక్రమార్కులా విరుచుకుపడ్డారు. ప్రత్యేకంగా, వేలంలో రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ రికార్డు ఇన్నింగ్స్ ఆడి తన విలువను చాటాడు. 45 బంతుల్లోనే శతకం నమోదు చేసిన అతడు, రాజస్థాన్ బౌలింగ్ను చీల్చి చెండాడాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ శుభారంభం ఇచ్చారు. అభిషేక్ శర్మ (24) మహీష్ తీక్షణ బౌలింగ్లో ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ట్రావిస్ హెడ్ 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 పరుగులు చేసి తుషార్ దేశ్పాండే బౌలింగ్లో ఔటయ్యాడు.
Assal Thaggede le! 🔥🧡
Ishan Kishan | #PlayWithFire | #SRHvRR | #TATAIPL2025 pic.twitter.com/32FUdXIAAk
— SunRisers Hyderabad (@SunRisers) March 23, 2025
హెడ్ వెనుదిరిగినప్పటికీ, ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడాడు. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన అతడు, ఆ తర్వాత మరింత రెచ్చిపోయి కేవలం 45 బంతుల్లోనే శతకం బాదాడు. అతని ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అతనికి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి (30), హెన్రిచ్ క్లాసెన్ (34) మెరుగైన ఆటతీరు కనబరిచారు. ఫలితంగా SRH నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
These three were definitely on the beat tonight 🔥#PlayWithFire | #SRHvRR | #TATAIPL2025 pic.twitter.com/r5DRu9Snd9
— SunRisers Hyderabad (@SunRisers) March 23, 2025
రాజస్థాన్ బౌలర్లు SRH ధాటికి తట్టుకోలేకపోయారు. తుషార్ దేశ్పాండే 3 వికెట్లు, మహీష్ తీక్షణ 2 వికెట్లు తీసినప్పటికీ భారీ పరుగులను ఇవ్వకుండా తప్పించుకోలేక పోయారు.
ఐపీఎల్ 2025 వేలంలో రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్, తన ధనాధన్ బ్యాటింగ్తో SRHకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఈ ప్రదర్శనతో SRH విజయానికి గట్టి పునాది వేసాడు.