FASTag: ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. రూ.3వేలతో.. ఆగస్టు 15 నుంచి అమలు..!

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారి కోసం కొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టింది. ఏకంగా రూ.3,000 చెల్లించి సంవత్సరానికి గరిష్ఠంగా 200 ట్రిప్పులు ప్రయాణించే అవకాశం ఈ పాస్ ద్వారా లభిస్తుంది. ఈ కొత్త విధానం ఆగస్టు 15, 2025 నుండి అమలులోకి రానుంది.

టోల్ పేమెంట్‌ను మరింత సులభతరం చేయడానికి ఈ ప్లాన్

టోల్ గేట్ల వద్ద తరచూ ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కీలక నిర్ణయం ప్రకటించారు. “సింగిల్ రీచార్జ్‌తో ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకూ ప్రయాణించవచ్చు. ఇది వ్యక్తిగత వాహనదారులకు పెద్ద రిలీఫ్,” అని ఆయన వివరించారు.

ఎవరికి ఉపయోగపడుతుంది?

ఈ వార్షిక పాస్ ముఖ్యంగా వ్యక్తిగత వాహనాలు (కార్లు, జీపులు, వ్యాన్లు) కోసం రూపొందించబడింది. వాణిజ్యేతర ప్రయాణికులు దీన్ని ఉపయోగించవచ్చు. టోల్ ప్లాజాల వద్ద తరచూ ఎదురయ్యే నిలిపివేతలు, క్యాష్ లావాదేవీల అవాంతరాలు ఇక పోతాయని కేంద్రం ఆశిస్తోంది.

ఫీచర్లు:

రూ.3,000లో సంవత్సరానికి 200 ట్రిప్పులు

దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై వర్తింపు

ఒకే సారి రీచార్జ్-ప్రయాణ సమయంలో నిలిపివేత లేకుండా టోల్ గేట్ దాటే వీలుతో

రద్దీ తగ్గింపు, వేచి ఉండే సమయం కూర్పు

యాక్టివేషన్, రెన్యూవల్ ఎలా?

ఈ ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ను ‘రాజ్‌మార్గ్ యాత్ర’ యాప్, NHAI, మరియు MoRTH అధికారిక వెబ్‌సైట్‌లు ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. త్వరలో ప్రత్యేక లింక్‌లు విడుదల చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు.

ఇక ఆలస్యం ఎందుకు? టోల్ రోడ్లను తరచూ ఉపయోగించే వారు వెంటనే ఈ కొత్త వార్షిక పాస్‌కి సిద్ధం అవ్వండి..!

Leave a Reply