ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం అధికార NDA తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సీ.పి. రాధాకృష్ణన్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా BJP ప్రకటించింది. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి.
ఈ నిర్ణయం కొంత అనూహ్యంగా ఉన్నప్పటికీ, బీజేపీ వ్యూహాత్మకంగా ఈ ఎంపికను చేసింది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
#WATCH | Delhi: Maharashtra Governor CP Radhakrishnan will be the NDA’s candidate for the Vice Presidential election, says BJP national president and Union Minister JP Nadda pic.twitter.com/VzSJVjoF6p
— ANI (@ANI) August 17, 2025
తమిళనాడుకు చెందిన సీ.పి. రాధాకృష్ణన్ గతంలో రెండు సార్లు కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బీజేపీలో సుదీర్ఘకాలం సీనియర్ నాయకుడిగా పనిచేసిన ఆయన, జార్ఖండ్ గవర్నర్గా కూడా సేవలందించారు. 2024 జూలై 27న మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు.
ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఇప్పటికే విపక్షాల ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే, పార్లమెంటులో NDAకి ఉన్న బలాన్ని బట్టి, సీ.పి. రాధాకృష్ణన్ సునాయాసంగా ఎన్నికవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Maharashtra Governor CP Radhakrishnan will be the NDA’s candidate for the Vice Presidential election.
– BJP national President & Union Minister @JPNadda #VicePresidentialElection | #CPRadhakrishnan pic.twitter.com/bdbhAWgYpz
— All India Radio News (@airnewsalerts) August 17, 2025
మొత్తంగా, సీ.పి. రాధాకృష్ణన్ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై తన ప్రభావాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో పార్టీ ఉనికిని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించింది. రాధాకృష్ణన్కు రాష్ట్ర రాజకీయాలపై మంచి అవగాహన ఉంది, ఇది భవిష్యత్తులో బీజేపీకి దక్షిణాదిలో లాభాన్ని చేకూరుస్తుందని పార్టీ నాయకత్వం విశ్వసిస్తోంది.