లక్నోలోని ప్రసిద్ధి చెందిన చంద్రికా దేవి ఆలయంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. దేవాలయం వద్ద ప్రసాదం కొనకుండా వెళ్లిన భక్తులపై అక్కడి కొందరు దుకాణదారులు దాడికి దిగారు. ఓ కుటుంబం ప్రసాదం కొనకుండా ముందుకు వెళ్లగా, దుకాణదారులు కక్ష పెంచుకుని బెల్టులు, చెప్పులతో వారిపై దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పరిధిలోని బక్షీ కా తలాబ్ ప్రాంతంలో ఉన్న చంద్రికా దేవి ఆలయానికి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారు. తాజాగా త్రివేణీనగర్కి చెందిన పియూష్ శర్మ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాడు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఉన్న దుకాణాల వద్దకి వెళ్లగా, అక్కడి వ్యాపారులు ప్రసాదం కొనాలంటూ పట్టు పట్టారు. కానీ శర్మ కుటుంబం ఆసక్తి చూపకపోవడంతో, అక్కడినుండి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు.
అయితే వ్యాపారులు వారి వెంటపడి వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన ఆరుగురు దుకాణదారులు ఏకంగా దాడికి పాల్పడి, చెప్పులు, బెల్టులతో చితకబాదారు. మహిళలు అడ్డుకునేందుకు వచ్చినా వారినీ తోసేశారు. ఈ ఘటనలో పియూష్ శర్మ కుటుంబానికి గాయాలు కావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
बीकेटी स्थित चंद्रिका देवी मंदिर पर दर्शन करने आए महिला व पुरुष श्रद्धालुओं को…मेला दुकानदारों ने जमकर पीटा..श्रद्धालु हुए चोटिल..पुलिस कर्मी नदारद..🙄..आए दिन श्रद्धालुओं से की जाती है..बदसलूकी..@LkoCp
मामला रफादफा करने में जुटे..चौकी प्रभारी..@lkopolice
जनहित में उक्त… pic.twitter.com/1oCycg98wE— Vivek Sharma (@Lko_VivekSharma) April 7, 2025
సోషల్ మీడియాలో ఈ దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ‘‘ప్రసాదం కొనలేదని ఇలా కొడతారా?’’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్లు ఇప్పటికే కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. భక్తులపై ఇలాంటి దాడులు ఇక జరగకూడదని, ఆలయ ప్రాంగణాల్లో వ్యాపారం చేసే వారిపై కఠిన నియంత్రణ అవసరమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.