ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ మావోయిస్టుల ఎన్కౌంటర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిజానికి వ్యతిరేకంగా గత మూడు దశాబ్దాలుగా సాగుతున్న పోరాటంలో ఇది చారిత్రక విజయం అని అభివర్ణించారు. “సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నాయకుడిని మట్టుబెట్టిన తొలి ఘటన ఇది. ఇది నక్సలిజంపై భారత ప్రభుత్వం నడిపిస్తున్న పోరాటంలో కీలక మైలురాయి” అని షా ట్వీట్ చేశారు.
A landmark achievement in the battle to eliminate Naxalism. Today, in an operation in Narayanpur, Chhattisgarh, our security forces have neutralized 27 dreaded Maoists, including Nambala Keshav Rao, alias Basavaraju, the general secretary of CPI-Maoist, topmost leader, and the…
— Amit Shah (@AmitShah) May 21, 2025
బసవరాజు ఎన్కౌంటర్ వివరాలు
నారాయణ్పూర్లో జరిగిన ఆపరేషన్లో భద్రతాదళాలు మొత్తం 27 మంది మావోయిస్టులను తుపాకులతో మట్టుబెట్టాయి. ఇందులో అగ్రనాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉండటం విశేషం. ఆయన నక్సలైట్ ఉద్యమానికి వెన్నెముకగా భావించబడ్డాడు.
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ విజయం
ఈ ఎన్కౌంటర్తో పాటు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ విజయవంతంగా పూర్తయింది. దీని ప్రభావంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో 54 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. మరో 84 మంది లొంగిపోయారు.
Sir, The way our soldiers are getting success by taking action against Naxalites, India will be completely Naxal free by 2026. Under your leadership in the Home Ministry with the guidance of Modi ji, #NaxalFreeBharat will be a historic success for the country.
#NaxalFreeIndia pic.twitter.com/FsYm08lzFX— Nishant🇮🇳 (@iNishant4) May 21, 2025
2026 నాటికి పూర్తి నిర్మూలన లక్ష్యం
ఈ విజయాలను పురస్కరించుకుని, నక్సలిజాన్ని 2026 మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు. భద్రతా దళాలు, ఇంటలిజెన్స్ విభాగాల కృషిని ఆయన ప్రశంసించారు.