Flight Accident: విమాన ప్రమాదంలో ఒకే కుటుంబం మృతి.. చివరి సెల్ఫీ ఇప్పుడు వైరల్

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాజస్థాన్‌కు చెందిన డాక్టర్ ప్రతీక్ జోషీ, భార్య డాక్టర్ కోమీ వ్యాస్, వారి ముగ్గురు చిన్నారులు.. ఐదేళ్ల మిరాయా, కవలలు నకులు, ప్రద్యుత్.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

వీరు లండన్‌కి వలస వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. విమానం ఎగరడానికి కొద్ది సేపటిక్రితమే కుటుంబం అంతా కలిసి తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సంతోషకర క్షణం కొద్ది గంటల్లోనే చీకటి ఛాయగా మారినట్టు నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఈ విమానంలో మొత్తం 250 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో దాదాపు అందరూ మృతి చెందినట్టు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. మృతుల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయని, నివారణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

డాక్టర్ ప్రతీక్ మరియు కోమీ వ్యాస్ దంపతులు ఉదయపూర్‌లోని పసిఫిక్ హాస్పిటల్‌లో పని చేసిన వారు. ప్రతీక్ కొంతకాలం క్రితమే లండన్‌కు వెళ్లి, ఇటీవలే కుటుంబాన్ని తీసుకెళ్లేందుకు స్వస్థలమైన బన్స్వారాకు వచ్చారు. భవిష్యత్తు ఆశలతో ప్రయాణం మొదలుపెట్టిన కుటుంబం ఇలా సమూలంగా మాయమవడం ఎంతో కంటతడి పెట్టిస్తోంది.

Leave a Reply