50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. ఒక్కరోజులో 8,500 ఇళ్లు కూల్చివేత!

గుజరాత్‌లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) భారీ స్థాయిలో అటకెక్కిన ఆక్రమణలపై ఆకస్మిక ఆపరేషన్ చేపట్టింది. చందోలా సరస్సు పరిసర ప్రాంతంలో అక్రమంగా నిర్మించబడిన 8,500 ఇళ్లను ఒక్కరోజే కూల్చివేస్తూ, దాదాపు 2.5 లక్షల చదరపు మీటర్ల భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్‌లో 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసు సిబ్బంది పాల్గొనడం విశేషం.

హైదరాబాద్‌లో హైడ్రా చర్యలు ఎలా ఉంటాయో మనం చూసే ఉంటాం. అయితే గుజరాత్‌లో జరిగిన ఈ ఆపరేషన్ intensity పదిరెట్ల ఎక్కువ. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నగర పోలీసులు కలిసి మే 1న చేపట్టిన ఈ ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఒక్కరోజే 8,500 ఇళ్లు కూల్చివేత
మంగళవారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో 350 మంది మున్సిపల్ సిబ్బంది పనిచేశారు. 35 బుల్డోజర్లు, 15 ఎర్త్‌మూవింగ్ మెషిన్లు మోహరించగా, భద్రత కోసం SRP సహా 3 వేల మందికి పైగా పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారు.

మూడు రోజుల ముందస్తు ప్రణాళిక
ఈ ఆపరేషన్ ఏప్రిల్ 29 నుండి మే 1 వరకు మూడు దశలుగా కొనసాగింది. మొదటి రోజు ఫామ్‌హౌస్‌లు, గిడ్డంగులు, తాత్కాలిక నివాసాలు కూల్చివేసి సుమారు 1 లక్ష చదరపు మీటర్ల స్థలం స్వచ్ఛం చేశారు. రెండవ రోజు 50 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలను తొలగించారు. చివరిరోజు వాణిజ్య కట్టడాలు లక్ష్యంగా చేసుకున్నారు.. ఇందులో ఘోడాసర్ సమీపంలోని 25 షాపులు, ఒక పెద్ద గిడ్డంగి, సరస్సు పక్కనున్న కట్టడాలు ఉన్నాయి.

ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన
అధికారుల ప్రకారం, దాదాపు 99.9 శాతం ఆక్రమణలు తొలగించబడ్డాయి. మిగిలింది కేవలం కొన్ని మతపరమైన కట్టడాలేనని తెలిపారు. 2010కి ముందు అక్కడ నివసిస్తున్న వారికి పునరావాస ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కానీ 2010 తర్వాత వచ్చిన వారికి మాత్రం స్థలం ఖాళీ చేయాల్సిందేనని తేల్చిచెప్పింది.

Leave a Reply